Velampalli Srinivas: మా పార్టీలో జరగబోయే బ్లాస్ట్ అదే.. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దు..

Velampalli Srinivas: బాలకృష్ణకు జ్ఞానం ఉంటే వాళ్ల నాన్న పరిపాలన, చంద్రబాబు పరిపాలన చూడమనండి. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం సరికాదు.

Velampalli Srinivasa Rao: తమ ప్రభుత్వంపై విమర్శలు చేసిన హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాలకృష్ణ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాము ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నామని అన్నారు. చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేయలేదు కాబట్టే ఎప్పుడూ ప్రజల్లోకి వెళ్లలేకపోయారని తెలిపారు. వైఎస్ జగన్ ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రజామద్ధతు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

విజయవాడలో శుక్రవారం 10 టీవీతో వెలంపల్లి మాట్లాడుతూ.. బాలకృష్ణకు జ్ఞానం ఉంటే వాళ్ల నాన్న పరిపాలన, చంద్రబాబు పరిపాలన చూడమనండి. వైఎస్ పాలన చూడాలి. జగన్ పాలన చూడండి. నాలుగు బేరీజు చేసుకొని బాలకృష్ణ (balakrishna)మాట్లాడాలి. కిలో బియ్యం అంటే ఎన్టీఆర్, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్.. జగన్ అంటే అమ్మ ఒడి చెబుతారు.. చంద్రబాబు (Chandrababu) అంటే అవినీతి పాలన అంటారు. ప్రజా‌సంక్షేమ పథకాలు అమలు చేయలేదు కాబట్టే చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ ఇంటి తలుపు తట్టలేదు. వైఎస్ జగన్ (YS Jagan) తన నాలుగేళ్ల పాలనలో తనతో పాటు ఎమ్మెల్యే లంతా ప్రజల్లోనే ఉంటున్నారు.

Also Read: పరిటాల శ్రీరామ్ కు టిక్కెట్ ఖరారు.. ఆల్ ది బెస్ట్ చెప్పిన కేతిరెడ్డి

వైసీపీ ఎమ్మెల్యేలు మీ వెనకాలే వస్తే 175 నియోజక వర్గాల్లో ఒంటరిగా పోటీ చేయండి. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము బాలకృష్ణ (balakrishna)కు ఉందా? వైసీపీ 175 నియోజకవర్గాల్లో గెలిచి జగన్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు అదే మా పార్టీలో జరగబోయే బ్లాస్ట్. జగన్ మా‌ బ్రాండ్ అంబాసిడర్. 2024లో వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతుంది. చంద్రబాబు పొత్తులతో ఎత్తులతో ఎన్నికల్లోకి వెళ్లేవారు కాని జగన్ ప్రజా సంక్షేమం పథకాలు అమలు చేసి వెళ్లారు. జగన్ ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రజామద్ధతు ఉంది. జగనన్నే మా భవిష్యత్.. మా‌ నమ్మకం నువ్వే జగన్ అని ప్రతి ఇంటికి వెళుతుంటే ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి మొదలైందని, వైసీపీలో బరెస్ట్ అవుతుందని హిందుపురంలో నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వెలంపల్లి స్పందించారు. తన అల్లుడు నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న బాలకృష్ణ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నవరత్నాల పేరుతో ప్రజలను మాయ చేశారని, వైసీపీ పాలనలో రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని బాలయ్య ధ్వజమెత్తారు.

Also Read: నాకు మించిన సైకాలజిస్ట్ లేరు, నేను అందరి సైకాలజీ చెబుతా అంటున్న బాలయ్య

ట్రెండింగ్ వార్తలు