ఆ కంటైనర్‌తో వైసీపీకి సంబంధాలు ఉన్నాయన్నారు కదా.. ఇప్పుడు బయటపెట్టండి: బొత్స

టీడీపీ నేతలు ఇప్పుడు విశాఖ ఫైల్స్ పేరుతో ఏవో బయటపెడతామని మాట్లాడుతున్నారని..

Botsa Satyanarayana

విశాఖ పోర్టులో ఈ ఏడాది మార్చిలో సీబీఐ పట్టుకున్న డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంపై టీడీపీ సర్కారు నిజాలను బయట పెట్టాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో ఆయన ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆ కంటైనర్‌తో వైసీపీకి సంబంధాలు ఉన్నాయంటూ అప్పట్లో ప్రతిపక్షంలోని టీడీపీ తమపై ఆరోపణలు గుప్పించిందని చెప్పారు.

ఆ కంటైనర్ ఎవరిదన్న విషయంపై కూటమి నేతలు పార్లమెంట్లో ప్రశ్న లేవనెత్తాలని బొత్స సత్యనారాయణ అన్నారు. ఆ కంటైనర్ డ్రగ్స్ ది కాకపోతే విశాఖ బ్రాండ్, ప్రతిష్ఠ మళ్లీ నిలబడుతుందని తెలిపారు. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని అన్నారు. అప్పట్లో ఎన్నికల కోడ్‌తో పాటు సీబీఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ సర్కారు జోక్యం చేసుకోలేదని తెలిపారు.

టీడీపీ నేతలు ఇప్పుడు విశాఖ ఫైల్స్ పేరుతో ఏవో బయటపెడతామని మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. 2014-19 మధ్య విశాఖలో వచ్చిన భూ ఆరోపణలపై అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఓపెన్ చేయాలని చెప్పారు. ప్రతి విషయాన్ని వైసీపీకి అంటగడుతూ ఆరోపణలు చేస్తే లాభం ఉండదని అన్నారు.

ఢిల్లీ కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థుల మృతి.. తెలంగాణలోనూ అలాంటి కోచింగ్ సెంటర్లను చూపిస్తా: రాజాసింగ్

ట్రెండింగ్ వార్తలు