YS Jagan: ఇడుపులపాయకు జగన్.. ఆయన వెంట తల్లి విజయమ్మ, సతీమణి భారతి రెడ్డి
కడప జిల్లాలో జగన్ నాలుగు రోజులు పాటు పర్యటిస్తారు.
- T Venkateshwarlu
- Published On : December 24, 2024 / 11:31 AM IST
YS Jagan Kadapa Tour: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇడుపులపాయ సమీపంలోని నెమళ్ల పార్క్ పక్కనున్న చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్ జగన్ వెంట ఆయన సతీమణి భారతి రెడ్డితో పాటు తల్లి విజయమ్మ కూడా ఉన్నారు.
కాగా, కడప జిల్లాలో జగన్ నాలుగు రోజులు పాటు పర్యటిస్తారు. ఇవాళ ఇడుపులపాయ ఎస్టేట్ కు చేరుకుంటారు. 25వ తేదీన పులివెందుల చర్చిలో జగన్ ప్రార్థనలు చేస్తారు. 26వ తేదీన పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు.
జగన్ కార్యక్రమాలు
- రేపు ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలకు హాజరు
- రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభం తర్వాత పులివెందుల చేరుకుని రాత్రికి అక్కడే బస
- ఎల్లుండి పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్బార్
- 27వ తేదీన ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్లో జరిగే వివాహానికి హాజరు
- ఆ తర్వాత బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్న జగన్
DK Aruna: అందుకే అల్లు అర్జున్పై రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు: డీకే అరుణ
