సోషల్ మీడియాలో వైసీపీ హవా
వైసీపీ సోషల్ మీడియా జపం చేస్తోంది. తమ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ.. ప్రచార పర్వంలో దూసుకుపోతోంది.

వైసీపీ సోషల్ మీడియా జపం చేస్తోంది. తమ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ.. ప్రచార పర్వంలో దూసుకుపోతోంది.
వైసీపీ సోషల్ మీడియా జపం చేస్తోంది. తమ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ.. ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. ఓ వైపు వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గాలను చుట్టేస్తుంటే.. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా వింగ్.. ప్రభుత్వ లొసుగులు, పొరపాట్లను ప్రజల మైండ్లోకి ఇంజెక్ట్ చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు 10శాతం తమకు పడినా.. విజయానికి దోహద పడతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తోంది. పార్టీ విడుదల చేసిన రావాలి జగన్ సాంగ్.. కోటికి పైగా వ్యూస్ సంపాదించుకోవడం వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహన్ని నింపుతోంది.
Read Also : రెండు వర్గాలు పరస్పర దాడి : ఐదుగురి పరిస్థితి విషమం
ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా క్యాంపెయినింగ్ జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో 4 కోట్లకు పైగా మొబైల్ ఫోన్లు వాడుకలో ఉన్నాయి. దాదాపు ప్రతి ఒక్కరికీ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్లలో ఏదో ఒకటి ఉంటోంది. కొంతమందికి అన్ని రకాల అకౌంట్లూ ఉన్నాయి. వారికి చేరువయ్యేందుకు వైసీపీ సోషల్ మీడియాను ఎంచుకుంది. అసలే ఎన్నికలకు తక్కువ టైం ఉండటంతో… సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది.
మార్చి 8న విడుదలైన రావాలి జగన్.. కావాలి జగన్ సాంగ్ యూట్యూబ్లో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ పాటను కొద్ది రోజుల్లోనే కోటి మందికి పైగా చూడడం సోషల్ మీడియాలో వైసీపీకి ఉన్న ఫాలోయింగ్ను చెప్పకనే చెబుతోంది. యువత, విద్యావంతులే లక్ష్యంగా సోషల్ మీడియాలో వైసీపీ దూసుకుపోతోంది. ఇన్నాళ్లూ ట్విట్టర్, ఫేస్బుక్ తో ప్రచారం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెబ్సైట్లలోను హల్ చల్ చేస్తోంది. ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా గూగుల్ యాడ్స్లోనూ వైసీపీ ప్రకటనలే దర్శనమిస్తున్నాయి.
Read Also : అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లో రుణ మాఫీ : రాహుల్ గాంధీ
సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఎక్కువ మందిని తమ వైపు ఆకర్షించేందుకు ఐటీ, సోషల్ మీడియా వింగ్ల ద్వారా భారీగా ఖర్చు చేస్తోంది. అధికార టీడీపీని ఇరుకున పెట్టేందుకు ఏ ఒక్క అవకాశం వచ్చిన వదిలిపెట్టడం లేదు. అధికార పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి తనకున్న అన్ని అవకాశాలని వినియోగించుకుంటుంది వైసీపీ. టీడీపీ లొసుగులు, నేతలు చేసిన పొరపాట్లుని బూతద్దంలో చూపిస్తూ ప్రజల్లో అధికార పార్టీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తోంది.
వైసీపీకి సంబంధించి 70 శాతం ప్రచారం సోషల్ మీడియా ద్వారానే చేస్తోంది. జగన్ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్కు చెందిన IPAC సంస్థ సోషల్ మీడియా ప్రచార నిర్వహణను చూసుకుంటోంది. ప్రశాంత్ కిశోర్ తన అనుభవాన్ని రంగరిస్తూ సోషల్మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు వైఫల్యాలను ఎండగడుతూ తటస్తులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. IPAC సభ్యులు… వైసీపీకి సంబంధించిన స్లోగన్లను ఐటీ నిపుణుల ద్వారా.. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నిన్ను నమ్మం బాబు, ఏపీ విత్ వైఎస్ఆర్సీపీ హ్యాష్ ట్యాగ్లతో ట్విట్టర్, ఫేస్బుక్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు.
జగన్ ప్రచారాన్ని ఓ వైపు లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ.. స్పీచ్ లోని హైలెట్స్ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. తద్వారా 10శాతం తటస్తులు తమవైపు మొగ్గు చూపినా గెలుపునకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ 3వస్థానంలో ఉంది. ఆప్ మొదటి స్థానంలో నిలవగా.. సమాజ్ వాదీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ఇక సోషల్ మీడియాలో ఖర్చులో వైసీపీ మొదటి స్థానంలో ఉండగా… టీడీపీ రెండో స్థానంలో ఉంది. ఈ రెండు పార్టీలూ కలిసి… 70శాతం ఎన్నికల ఖర్చును సోషల్ మీడియాపైనే చేస్తుండటం విశేషం.
Read Also : ఎయిర్ పోర్ట్ పేరు మార్చాలి…విమానంలో పార్టీ అధ్యక్షుడు నిరసన