YCP sajjala : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బంధం కొనసాగుతూనే ఉంటుంది-సజ్జల

ఏపీలో  ఉన్నంత  కడుపు మంట రాజకీయాలు దేశంలో మరెక్కడా లేవని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.

YCP sajjala : ఏపీలో  ఉన్నంత  కడుపు మంట రాజకీయాలు దేశంలో మరెక్కడా లేవని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ…. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ నేను సీఎం, అంటే నేను సీఎం అని కొట్టుకుంటున్నారని అన్నారు.  చంద్రబాబు  ఒకపక్క త్యాగం అంటాడు, మరోపక్క లీడ్ చేస్తానంటాడు…. వీళ్లకు ప్రజలంటే లెక్క లేని తనంగా ఉందని సజ్జల దుయ్యబట్టారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని… చంద్రబాబు స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతోందని ఆయన అన్నారు.  వీరిద్దరి బంధం కొనసాగుతూనే ఉంటుందని… ఎన్నికలకు ఇంకా రెండేళ్లు టైమ్ ఉందని, ప్రజల్లో చర్చ కోసమే పొత్తులు అంటూ మాట్లాడుతున్నారని సజ్జల అన్నారు.

2019 ఎన్నికల్లో వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ ఒంటరిగా పోటీ చేశాడని వీళ్లకు రాజకీయ అవసరాలే తప్ప ప్రజాప్రయోజనాలు పట్టవని సజ్జల ఆరోపించారు. ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిధ్దమవుతోందని ఎల్లుండి నుంచి ప్రజల్లోకి వెళుతున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు.

Also Read : Lemon Scam : నిమ్మకాయల కుంభకోణం-జైలు సూపరింటెండెంట్‌ను పట్టిచ్చిన ఖైది

ట్రెండింగ్ వార్తలు