Akshaya Tritiya 2026 : అక్షయ తృతీయ నాడు బంగారం ఎలా కొనాలి? బెస్ట్ టైమ్ ఏంటి? BIS యాప్తో స్వచ్ఛత ఎలా చెక్ చేయాలి? పూర్తి గైడ్!
Akshaya Tritiya 2026 : ఏప్రిల్ 19నే అక్షయ తృతీయ.. ఈ రోజున బంగారం కొనాలని అనుకుంటున్నారా? ముందుగా బంగారం స్వచ్ఛతను చెక్ చేయండి. BIS యాప్ ద్వారా కొనే బంగారం ఆభరణాల వివరాలను తెలుసుకోవచ్చు.
Akshaya Tritiya 2026
- అక్షయ తృతీయ నాడు బంగారం కొనేవాళ్లకు అలర్ట్
- BIS యాప్ ద్వారా బంగారం స్వచ్ఛతను చెక్ చేయొచ్చు
- ఏప్రిల్ 19న ఏయే సమయాల్లో బంగారం కొనొచ్చంటే?
Akshaya Tritiya 2026 : అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? అయితే జర జాగ్రత్త.. బంగారం కొనే ముందు బంగారం స్వచ్ఛతను తప్పనిసరిగా చెక్ చేయండి. ఇందుకోసం, BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) హాల్మార్క్ను చెక్ చేయాలి. మీరు BIS కేర్ యాప్లో HUID నంబర్ను ఎంటర్ చేసి కూడా మీ ఆభరణాల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.
అక్షయ తృతీయను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం చాలా కాలంగా ఉంది. కొనుగోలు చేసిన బంగారం ఇంటికి ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తుందని, తరతరాలుగా నిలుస్తుందని నమ్ముతారు. ఈ ఏడాదిలో అక్షయ తృతీయను ఏప్రిల్ 19, 2026, ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రతి ఏడాదిలాగే, బంగారం కోసం డిమాండ్ ఇప్పటికే పెరిగింది.
క్యాలెండర్ ప్రకారం.. తృతీయ తిథి ఏప్రిల్ 19న ఉదయం 10:49 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 20న ఉదయం 7:27 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో వివిధ నగరాల్లో శుభప్రదమైన సమయాలుగా నిర్ణయించారు. ఇక్కడ ప్రజలు బంగారం కొనేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.
నగరాల వారీగా ముహూర్త సమయాలివే :
- ఢిల్లీ, నోయిడా : ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు
- ముంబై : ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు
- పూణే : ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:34 వరకు
- అహ్మదాబాద్ : ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు
- జైపూర్ : ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:26 వరకు
- చెన్నై : ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:08 వరకు
- హైదరాబాద్ : ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు
- విజయవాడ : ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు
- విశాఖపటన్నం : ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు
- బెంగళూరు : ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:19 వరకు
- కోల్కతా : ఉదయం 10:49 నుంచి 11:36 వరకు
- చండీగఢ్ : ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు
- గురుగ్రామ్ : ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు
బంగారం కొనుగోలు విధానంలో మార్పు :
ఇప్పుడు బంగారాన్ని కేవలం ఆభరణాల కోసమే కాదు.. పెట్టుబడి కోసం కూడా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా 24-క్యారెట్ల గోల్డ్ నాణేలు, కడ్డీలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే బంగారు నాణేలు లేదా కడ్డీలను అమ్మినప్పుడు ఎలాంటి తరుగుదల ఉండదు. వాటికి మార్కెట్ ధర లభిస్తుంది.
Read Also : PF Withdrawal : వావ్.. ఇక UPI, ATM ద్వారా మీ PF డబ్బులు తీసుకోవచ్చు.. కొత్త లిమిట్ ఎంతో తెలుసా?
అలాగే, డిజిటల్ గోల్డ్ గోల్డ్ ఈటీఎఫ్ల వంటి ఆప్షన్లకు కూడా బాగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా అక్షయ తృతీయ నాడు ఈటీఎఫ్ల ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టే యువ పెట్టుబడిదారులలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాంప్రదాయ ఆభరణాలకు డిమాండ్ ఉన్నప్పటికీ, చాలామంది లైట్ ఉండే సరసమైన డిజైన్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
బంగారం కొనేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి :
బంగారం కొనేటప్పుడు స్వచ్ఛతను చెక్ చేయడం చాలా ముఖ్యం. ఇందుకోసం, BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) హాల్మార్క్ను చూడాలి. హాల్మార్క్ ఉన్న ప్రతి ఆభరణానికి HUID (హాల్మార్క్ యూనిక్ ఐడీ) నంబర్ ఉంటుంది.
ఈ మార్క్ ఉపయోగించి బంగారం స్వచ్ఛతను చెక్ చేయొచ్చు. ప్రభుత్వం BIS కేర్ యాప్ను కూడా ప్రారంభించింది. ఇందులో మీరు HUID నంబర్ను ఎంటర్ చేయడం ద్వారా ఆభరణాల సమాచారాన్ని ఈజీగా చెక్ చేయవచ్చు.
