Baba Vanga Gold ForeCast : గోల్డ్ మార్కెట్ దద్దరిల్లే జోస్యం.. బంగారం ధరలపై బాబా వంగా చెప్పిన 2026 మిస్టరీ లీక్..!

Baba Vanga Gold ForeCast : 2026లో బాబా వంగా అంచనాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. బంగారం ధరకు సంబంధించి కొన్ని షాకింగ్ అంచనాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Baba Vanga Gold ForeCast : గోల్డ్ మార్కెట్ దద్దరిల్లే జోస్యం.. బంగారం ధరలపై బాబా వంగా చెప్పిన 2026 మిస్టరీ లీక్..!

Updated On : December 3, 2025 / 5:17 PM IST

Baba Vanga Gold ForeCast : బంగారం ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్.. భవిష్యత్తులో బంగారం ధరలు ఎవరూ ఊహించలేనంత స్థాయికి పెరగబోతున్నాయి. ప్రత్యేకించి 2026లో బంగారం ధరలకు సంబంధించి షాకింగ్ నిజాలను బాబా వంగా అంచనా వేశారు.

బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ అంధ జ్యోతిష్యురాలు (Baba Vanga Gold ForeCast) బాబా వంగా మరణించినప్పటికీ ఆమె చెప్పిన జ్యోతిష్యశాస్త్ర అంచనాలు దాదాపు అన్ని నిజం అయ్యాయి. ప్రపంచాన్ని దశాబ్దాల ముందుగానే కుదిపేసిన సంఘటనలను ఆమె అంచనా వేశారు. ఇప్పుడు 2026లో బాబా వంగా అంచనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా, బంగారం ధరలలో భారీ పెరుగుదల నుంచి గ్రహాంతరవాసులతో పరిచయం వరకు ఆమె అంచనాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. బాబా వంగా అంచనాల ప్రకారం.. 2026 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత అస్థిరంగా మారనుంది. అంతేకాదు..ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని ఆమె అంచనా వేసింది. ఫలితంగా సాంప్రదాయ బ్యాంకింగ్ ప్రక్రియలకు భారీగా నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.

40శాతానికి పెరగనున్న బంగారం ధరలు :
బ్యాంకింగ్ రంగంలో అస్థిరత, కరెన్సీ విలువ, మార్కెట్లో ద్రవ్యత తగ్గడం వంటి సంఘటనలు సంభవించవచ్చని ఆమె అంచనాలు సూచిస్తున్నాయి. సాధారణంగా, ఇలాంటి ఆర్థిక అనిశ్చితి సమయంలో చాలామంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడి కోసం బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. డిమాండ్ పెరుగుదల కారణంగా 2026 నాటికి బంగారం ధరలు 25 శాతం నుంచి 40 శాతం పెరిగే అవకాశం ఉందని ఈ అంచనాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం, భారత బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.30 లక్షలు.

గ్రహాంతరవాసుల పరిచయం, ప్రకృతి వైపరీత్యాల ముప్పు :

2026లో ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని బాబా వంగా హెచ్చరించారు. ప్రపంచ స్థాయిలో ప్రధాన మార్పులకు దారితీయవచ్చు. మానవ చరిత్రలో మొదటిసారిగా గ్రహాంతరవాసులతో ప్రత్యక్ష సంబంధం సాధ్యమవుతుందని ఆశ్చర్యకరమైన అంచనా వేశారు. ఇది ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే విషయంగా పేర్కొన్నారు.

Read Also : Gold Rates : గోల్డ్ కొనేవాళ్లకు గోల్డెన్ షాక్.. 2026లో బంగారం ధరలు ఊహించని స్థాయికి.. ఇప్పుడే కొనేసుకోండి..!

మానవ మనుగడకు సవాల్‌గా ఏఐ :
2026లో ఏఐ టెక్నాలజీ అత్యంత పవర్‌ఫుల్‌గా మారనుంది. మానవ జీవితానికి గణనీయమైన సవాలుగా మారుతుందని బాబా వంగా హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీ అనేది మానవ జీవితంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు. అణుశక్తి సమస్యల మధ్య, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు వేగంగా గ్రీన్ ఎనర్జీ, ఫ్యూజన్ రియాక్టర్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. భవిష్యత్తులో మానవ అవసరాలను తీర్చడంలో ఈ కొత్త శక్తి వనరులు కీలక పాత్ర పోషిస్తాయని బాబా వంగా అంచనా వేశారు.

బాబా వంగా ఎవరంటే? :
బాబా వంగా అసలు పేరు బల్గేరియన్ ఏంజెలికా పాండేవా గుషారోవా. ఆమె పుట్టుకతోనే అంధురాలు కాద.. తుఫానులో జరిగిన ప్రమాదంలో ఆమె చూపు కోల్పోయింది. అయితే, ఆ తర్వాత ఆమె అసాధారణ దూరదృష్టిని పొందిందని నమ్ముతారు. గతంలో ఆమె అంచనాలు చాలావరకూ నిజమయ్యాయి కొందరు ఆమెను గొప్ప దార్శనికురాలిగా భావిస్తారు.

మరికొందరు కేవలం యాదృచ్చికంగా భావిస్తారు. ఏదిఏమైనా ఆమె ప్రవచనాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 2026లో ఏం జరుగుతుందో బాబా వంగా అంచనాలు ఆందోళనతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నాయి. ఇంతకీ బాబా వంగా అంచనాలు నిజమా లేక కేవలం ఊహాగానామా అనేది కాలమే నిర్ణయిస్తుంది.