EPFO Alert 2025 : మీ పీఎఫ్ అకౌంటులో డబ్బు ఉంది.. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎలా పడితే అలా వాడేసుకుంటానంటే ఇక కుదరదు.. సరైన రీజన్ చెప్పి మరి పీఎఫ్ డబ్బు తీసుకోవాలి? లేదంటే భారీమూల్యం చెల్లించుకోక తప్పదు. చాలామంది తమకు ఎమర్జెన్సీ లేకపోయినా రాంగ్ రీజన్ చూపుతూ పీఎం డబ్బులను విత్ డ్రా చేస్తుంటారు. కొందరు అయితే ఊటీ ట్రిప్ కోసమని మరికొంతమంది లగ్జరీ వాచ్ కొని గిఫ్ట్ ఇచ్చేందుకు డబ్బులు తీసుకుంటుంటారు.
కానీ, కారణం మాత్రం మ్యారేజ్ లేదా అనారోగ్యం (EPFO Alert 2025) వంటి ఇతర కారణాలుగా చూపుతారు. ఇలాంటి వారి విషయంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కఠినంగా వ్యవహరిస్తోంది. 2025లో పీఎఫ్ ఫండ్స్ రాంగ్ రీజన్ చెప్పి డబ్బులు విత్ డ్రా చేసేవారిపై భారీగా జరిమానాలను విధించనుంది. అంతేకాదు.. తీసుకున్న మొత్తంపై వడ్డీతో సహా ముక్కు పిండి వసూలు చేయనుంది. దీనికి సంబంధించి ఈపీఎఫ్ఓ పీఎఫ్ సభ్యులకు ఒక హెచ్చరిక జారీ చేసింది.
Withdrawing PF for wrong reasons can led to Recovery under EPF Scheme 1952.
Protect your future, use PF only for the right needs. Your PF is your lifelong safety shield!#EPFO #EPFOwithYou #HumHainNa #ईपीएफओ@PMOIndia @narendramodi @LabourMinistry @MIB_India @mansukhmandviya… pic.twitter.com/HMxUpWFair— EPFO (@epfoofficial) September 22, 2025
పీఎఫ్ డబ్బుల కోసం ఎవరైనా రాంగ్ రీజన్ చెప్పి నిధులను దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈపీఎఫ్ స్కీమ్ 1952 ప్రకారం.. వడ్డీతో పాటు ఫండ్స్ చందాదారుల నుంచి రికవరీ చేసే అధికారం ఉందని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఈపీఎఫ్ అడ్వాన్సులు వివాహం, విద్య, అనారోగ్యం, గృహనిర్మాణం వంటి నిర్దిష్ట ప్రయోజనాలకే పరిమితమని ప్రకటనలో స్పష్టం చేసింది.
‘మీ భవిష్యత్తును రక్షించుకోండి. మీ పీఎఫ్ డబ్బుల్ని సరైన అవసరాల కోసమే పీఎఫ్ వినియోగించండి. మీ PF మీ జీవితాంతం భద్రతా వలయం’ అని ట్విట్టర్ వేదికగా సూచించింది. పీఎఫ్ కార్పస్ దీర్ఘకాలిక పదవీ విరమణ భద్రతా వలయమని, ఆర్థిక ఇబ్బందులను నివారించేందుకు సభ్యులు విత్డ్రా రూల్స్ కచ్చితంగా పాటించాలని ఈపీఎఫ్ఓ స్పష్టంచేసింది.
పీఎఫ్ సభ్యులు ఎవరైనా తమ పీఎఫ్ డబ్బును విత్డ్రా కోసం తప్పుడు కారణాన్ని చూపితే.. ఉదాహరణకు.. ఇల్లు కొనుగోలు కోసం అని చెప్పి ఆ తరువాత డబ్బును మరో అవసరానికి వాడుకోవడం చేస్తే.. అప్పుడు ఈపీఎఫ్ఓ ఈ ఫండ్స్ వడ్డీతో సహా వసూలు చేయడంతో పాటు జరిమానా కూడా విధించే హక్కును కలిగి ఉంటుంది.
సెక్షన్ 68B(11) రూల్ : దుర్వినియోగానికి జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈపీఎఫ్ పథకం సెక్షన్ 68B(11) కింద కఠినమైన రూల్స్ విధిస్తుంది.
ఒక సభ్యుడు విత్డ్రా చేసిన ఫండ్స్ దుర్వినియోగం చేస్తున్నట్లు తేలితే 3 ఏళ్ల వరకు విత్డ్రా చేసేందుకు అనుమతి ఉండదు.
మునుపటి మొత్తాన్ని వడ్డీతో పూర్తిగా తిరిగి చెల్లించే వరకు కొత్త అడ్వాన్సులు అప్రూవల్ చేయరు.
ఈ పరిమితితో ఫండ్స్ దుర్వినియోగం కాకుండా వారి భవిష్యత్తులో మాత్రమే వినియోగానికి వీలుంటుంది.
ఆన్లైన్ క్లెయిమ్ దాఖలుకు ఈ కింది షరతులను పాటించాలి :
2025లో కొత్త విత్డ్రా లిమిట్స్ :
జూన్ 2025లో ఈపీఎఫ్ఓ ఆటో-సెటిల్మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచింది. దీని వలన సభ్యులు చిన్న అవసరాల కోసం ఈపీఎఫ్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. ఈపీఎఫ్ఓ హెచ్చరికతో పీఎఫ్ ఫండ్స్ అత్యవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అయితే, ఎవరైనా ఫండ్స్ దుర్వినియోగం చేస్తే ఆ మొత్తంతో పాటు వడ్డీ, జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే భవిష్యత్తులో భవిష్యత్తులో అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకునే అవకాశం కోల్పోతారు.
పీఎఫ్ విత్డ్రా కొత్త రూల్స్ ఏంటి? :
ఈపీఎఫ్ స్కీమ్ 1952 ద్వారా విత్డ్రాకు నిబంధనలివే :