Gold Rate Today : తగ్గిన బంగారం ధర.. బాబోయ్ ఎంత తగ్గిందో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర స్వల్పంగా తగ్గింది. దీంతో ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ ప‌ట్ట‌ణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ...

Gold

Gold And Silver Price : మీరు బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారా? అయితే, గోల్డ్ కొనుగోలుకు ఇదే మంచి సమయం అని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే.. ఈనెల చివరి వారం నుంచి రెండు నెలలు పాటు పెళ్లిళ్ల సందడి కొనసాగనుంది. దీంతో మార్చి, ఏప్రిల్ నెలలో బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. డిమాండ్ పెరిగితే ధరలుకూడా పెరిగే అవకాశం ఉంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గితే వచ్చే రెండు నెలలు దేశంలో గోల్డ్ ధరలు తగ్గే అవకాశమూ లేకపోలేదు. ఇదిలాఉంటే.. గడిచిన పది రోజుల్లో మూడుసార్లు బంగారం ధర రూ. 550 పెరగ్గా.. అదే పదిరోజుల్లో ఐదు సార్లు బంగారం ధర రూ. 600 తగ్గింది. మరో రెండు రోజులు గోల్డ్ ధర స్థిరంగా కొనసాగింది. తాజాగా శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 10 తగ్గగా, 24 క్యారెట్ల బంగారంపైనా రూ. 10 తగ్గింది. వెండి ధర స్వల్పగా పెరిగింది. కిలో వెండిపై రూ. 100 పెరిగింది.

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర స్వల్పంగా తగ్గింది. ఎంతంటే తులం బంగారంపై రూ. 10 తగ్గింది. దీంతో ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ ప‌ట్ట‌ణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,890 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,150 వద్ద కొనసాగుతుంది.

  • దేశంలోని ప్రధాన నగరాల్లో..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,040 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,300 వద్దకు చేరింది.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో .. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,890 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,150 వద్ద కొనసాగుతుంది.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,380 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,700 వద్దకు చేరింది.

 

  • పెరిగిన వెండి ధర ..
    దేశవ్యాప్తంగా వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ. 100 పెరిగింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 76,600 గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 76,600కాగా.. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.75,100కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,600 వద్ద కొనసాగుతోంది.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.