Gold Rate Today : వామ్మో.. రికార్డులు బద్దలవుతున్నాయ్.. ఇక బంగారం, వెండి కొనుడు కష్టమే.. ఏపీ, తెలంగాణలో ఇవాళ్టి ధరలు ఇవే..

Gold Rate Today : శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.870 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.800 పెరిగింది.

Gold Rate Today : వామ్మో.. రికార్డులు బద్దలవుతున్నాయ్.. ఇక బంగారం, వెండి కొనుడు కష్టమే.. ఏపీ, తెలంగాణలో ఇవాళ్టి ధరలు ఇవే..

Gold Rate Today

Updated On : September 6, 2025 / 1:02 PM IST

Gold Rate Today : పసిడి ప్రియులకు ఊరట లభించడం లేదు. బంగారం ధర రోజురోజుకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఫలితంగా.. గతంలో రికార్డులు బద్దలవుతున్నాయి. గడిచిన రెండు వారాల్లో 10గ్రాముల బంగారంపై సుమారు రూ.7వేల వరకు పెరిగింది. శనివారంసైతం గోల్డ్ రేటు భారీగా పెరిగింది.

Also Read: Tata Car Prices : పండగ చేస్కోండి.. టాటా కార్ల ధరలు తగ్గాయోచ్.. ఏ మోడల్ కారు ధర ఎంత తగ్గిందంటే?

శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.870 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.800 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 38 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,586 డాలర్ల వద్ద కొనసాగుతుంది.
వెండిధర సైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.2వేలు పెరిగింది. బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న క్రమంలో మధ్య తరగతి భారతీయులకు నిరాశను మిగుల్చుతున్నాయి. దసరాకు ముందు వరుసగా పెరుగుతున్న రేట్లకు అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక పరిస్థితులతోపాటు.. అమెరికా సుంకాల మోత కూడాకారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.99,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,08,490కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,08,620కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.99,450 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,08,490కు చేరింది.

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,38,000కు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,28,000కు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,38,000కు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.