Gold Rate Today : పండుగ వేళ బంగారం కొనుగోలుదారులకు బిగ్ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. గత నాలుగు రోజులుగా తులం బంగారంపై సుమారు రూ. 800 తగ్గింది. కానీ, శనివారం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారంపై ..

Gold Rate
Today Gold and Silver Rate : దీపావళి పండుగ వేళ బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి షాకింగ్ న్యూస్.. గత నాలుగు రోజులుగా తగ్గుకుంటూ వచ్చిన బంగారం ధర శనివారం భారీగా పెరిగింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 300 పెరగ్గా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ.330 పెరిగింది. వెండి ధరసైతం భారీగా పెరిగింది. మూడు రోజులుగా కిలో వెండి పై రూ. 2వేలు తగ్గగా.. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 800 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. గత నాలుగు రోజులుగా తులం బంగారంపై సుమారు రూ. 800 తగ్గింది. కానీ, శనివారం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారంపై రూ. 300 నుంచి రూ. 330 వరకు పెరిగింది. దీంతో తెలంగాణ, ఏపీలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 56,000 కాగా, 24క్యారెట్ల 10గ్రాములు గోల్డ్ రూ. 61,090 కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,150 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 61,240.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,090 కు చేరింది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,450 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.61,580కు చేరింది.
పెరిగిన వెండి ధర..
వెండి ధర భారీగా పెరిగింది. గత మూడు రోజులుగా కిలో వెండిపై రూ. 2వేలు తగ్గగా..శనివారం కిలో వెండిపై రూ. 800 పెరిగింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,000కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,000. ముంబయి, ఢిల్లీ, కోల్కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.74,000 కు చేరింది. బెంగళూరులో కిలో వెండిపై రూ. 250 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి రూ.72,750 వద్ద కొనసాగుతుంది.