Gold And Silver Price Today On 21st
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర నేడు పెరిగింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం పై రూ.750 పెరిగింది. కిలో వెండిపై రూ.1500 పెరిగింది. ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,150కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,250.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,300 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,400
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,150 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,250.
– చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,800 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,970.
వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా శుక్రవారం కిలో వెండి పై రూ.1500 పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 98,500.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
– చెన్నైలో కిలో వెండి రూ.98,500.
– కోల్ కతా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.94,000.
– బెంగళూరులో కిలో వెండి ధర రూ. 92,850 వద్ద కొనసాగుతుంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.