Gold and Silver Price Today : గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి ధర శుక్రవారం భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 700 తగ్గింది. మరోవైపు బంగారం ధర వరుసగా మూడోరోజు పెరిగింది. గత రెండు రోజుల్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 1400 పెరగ్గా.. తాజాగా శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. రూ. 330 పెరిగింది. దీంతో మూడు రోజుల్లోనే బంగారం ధర రూ. 1730 పెరిగింది. కేంద్ర బడ్జెట్ ప్రకటన తరువాత భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. మూడు రోజులుగా పెరుగుతుండటంతో మధ్య తరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,800 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.70,690.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.64,950 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 70,840.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.64,800 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,690.
చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,600 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,470కు చేరింది.
వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా శుక్రవారం వెండి ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 91,100. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.91,000.
కోల్ కతాలో కిలో వెండి ధర రూ. 86,500 వద్ద కొనసాగుతుంది.
ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.86,500.
ముంబయిలో కిలో వెండిపై రూ.100 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి రూ. 87,200 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో కిలో వెండిపై రూ.500 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 86,000 వద్ద కొనసాగుతుంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.