Gold Price
Today Gold and Silver Rate : భారత్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ఖరీదైనవిగా మారుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. వరుస పండుగల నేపథ్యంలో మహిళలు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో బంగారం కొనుగోలుకు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి. అయితే, మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 210 తగగ్గా.. 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 230 తగ్గింది. మరోవైపు వెండి ధర కిలో రూ. 80వేలకు చేరువలో ఉంది. మంగళవారం కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది.
Gold
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 57,200 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 62,400కు చేరుకుంది.
Gold
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,350 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 62,550కి చేరింది.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400 కు చేరింది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ. 360 తగ్గగా.. 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 400 తగ్గింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,350కి తగ్గగా, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,560 వద్దకు చేరింది
Gold
భారీగా పెరిగిన వెండి ధర..
గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన వెండి ధర భారీగా పెరిగింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 1,000 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 78,500కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,500. ముంబయి, ఢిల్లీ, కోల్కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.75,600 వద్దకు చేరింది. బెంగళూరులో మాత్రం వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 250 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి రూ.74,000 వద్దకు చేరింది.