Gold Rate Today : గుడ్ న్యూస్.. వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?

దీపావళి పండుగ వేళ బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. బంగారం తగ్గుముఖం పడుతోంది. వరుసగా మూడో రోజు గోల్డ్ ధరలు తగ్గాయి.

Gold Rate Today : గుడ్ న్యూస్.. వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?

Gold Price

Updated On : November 9, 2023 / 8:15 AM IST

Today Gold and Silver Rate : దీపావళి పండుగ వేళ బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. బంగారం ధర తగ్గుముఖం పడుతోంది. వరుసగా మూడో రోజు గోల్డ్ ధరలు తగ్గాయి. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 150 తగ్గగా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 160 తగ్గింది. దీంతో మూడు రోజుల్లో తులం బంగారంపై సుమారు రూ. 350 నుంచి రూ.400 వరకు తగ్గింది. మరోవైపు వెండి ధరసైతం తగ్గింది. బుధవారం కిలో వెండిపై రూ. 700 తగ్గగా.. గురువారం రూ. వెయ్యి తగ్గింది. దీంతో రెండు రోజుల్లో కిలో వెండిపై రూ. 1700 తగ్గింది.

Gold

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా మూడో రోజు తగ్గింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 56,100 కాగా, 24 క్యారెట్ల 10గ్రాములు గోల్డ్ రూ. 61,200 వద్దకు చేరింది.

Gold gold

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,250 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 61,350.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,200కు చేరింది.
– చెన్నైలో తులం బంగారంపై రూ. 100 తగ్గింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,600 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.61,750 కు చేరింది.

Gold

Gold

తగ్గిన వెండి ధర..
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం .. వెండి ధర తగ్గింది. బుధవారం కిలో వెండిపై రూ. 700 తగ్గగా.. గురువారం కిలో వెండిపై రూ. 1000 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 76,500కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 76,500. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.73,500 వద్దకు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ.73వేలకు చేరింది.