Gold: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. దేశంలో పసిడి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,08,000గా ఉంది.

Gold: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. దేశంలో పసిడి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

Updated On : February 25, 2025 / 10:33 AM IST

బంగారం కొనుగోలుదారులకు మళ్లీ షాక్. పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ ఉదయం 10 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ.80,750గా ఉంది.

అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మరింత పెరిగింది. రూ.220 పెరిగి తులం బంగారం ధర రూ.88,090గా ఉంది. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.

ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.210 పెరిగి రూ.80,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.88,240గా ఉంది.

Also Read: బంగ్లాపై న్యూజిలాండ్‌ గెలవడంతో భారత్‌, పాక్‌ పరిస్థితులు ఎలా మారిపోయాయో తెలుసా? నెక్స్ట్‌ ఏంటి? 

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగింది. ముంబైలో తులం బంగారం ధర రూ.80,750గా ఉంది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మాత్రం కొంత పెరిగింది. రూ.220 పెరిగి తులం బంగారం ధర రూ.88,090గా ఉంది.

ఇవాళ వెండి ధరల్లో ఎలాంటి మార్పు కనపడలేదు

ఏ నగరాల్లో ఎలా?

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,08,000గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.1,08,000గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,08,000గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,01,000గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.1,01,000గా ఉంది