Raptee Energy e-Bike : రాప్టీ ఎనర్జీ కొత్త ఇ-బైక్ వచ్చేస్తోంది.. 150కి.మీ రేంజ్‌తో దూసుకెళ్లగలదు..!

Raptee Energy e-Bike : రాప్టీ ఎనర్జీ నుంచి వచ్చే ఏప్రిల్‌లో కొత్త ఇ-బైక్ రాబోతోంది. సీ-త్రూ వెర్షన్ మోడల్ బైక్ కాన్సెప్ట్‌ను కంపెనీ ప్రదర్శించింది. సింగిల్ ఛార్జ్‌పై 150 కిలోమీటర్ల పరిధిని అందుకోగలదు. పూర్తి వివరాలివే..

Indian startup showcases ‘see-through’ e-bike concept with 150 km range

Raptee Energy e-Bike : చెన్నైకి చెందిన ఈవీ స్టార్టప్ రాప్టీ ఎనర్జీ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సీ-త్రూ వెర్షన్‌ను తమిళనాడులో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ (GIM)లో ప్రదర్శించింది. అతి త్వరలో ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్‌కు రెడీగా ఉంది. ఈ కొత్త మోడల్‌కు ఫీచర్ల వివరాలను ఈవెంట్‌లో రివీల్ చేసింది. ఈ ప్రత్యేకమైన ఈవీ బైక్ అధికారిక లాంచ్ ఏప్రిల్ 2024లో జరగనుంది.

Read Also : Realme 12 Pro 5G Series : రియల్‌మి 12 ప్రో 5జీ సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్, తయారీదారు క్లెయిమ్ చేసినట్లుగా శక్తివంతమైన డ్రైవ్‌ట్రెయిన్‌తో గంటకు 135కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది. అంతేకాదు.. ఒకే ఛార్జ్‌పై ప్రపంచ పరిధి 150 కిమీ వరకు వేగాన్ని అందుకోగలదు. సీసీఎస్2 స్టేషన్‌లలో వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలను కూడా అందిస్తుంది.

45 నిమిషాల్లో 80శాతం ఛార్జింగ్ :
రాప్టీ ప్రకారం.. ఏదైనా (CCS2) ఛార్జింగ్ స్టేషన్‌లో వాహనాన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. 80 శాతం సామర్థ్యాన్ని చేరుకోవడానికి కేవలం 45 నిమిషాలు లేదా 40 కి.మీల పరిధికి 15 నిమిషాల ఛార్జ్ అవసరం. అంతేకాకుండా, శక్తివంతమైన మోటారును కలిగిన మోటార్‌సైకిల్.. ఈవీ బైక్ 3.5 సెకన్లలో నిలిచిపోయినప్పటి నుంచి గంటకు 60 కిలోమీటర్ల వరకు నడిపించగలదని ఈవీ తయారీదారు పేర్కొంది.

Indian startup  ‘see-through’ e-bike concept

ఏటా లక్ష యూనిట్లు ఉత్పత్తి లక్ష్యంగా :
ఈవీ స్టార్టప్ ఇప్పటికే చెన్నైలో మొదటి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపాదిత రూ. 85 కోట్ల పెట్టుబడితో 4 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆర్ అండ్ డీ కేంద్రాన్ని కలిగిన ఈ సదుపాయం వచ్చే రెండేళ్లలో ఏటా 1 లక్ష యూనిట్ల వరకు ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉందని కంపెనీ తెలిపింది.

భారత్‌‌లో ఈవీ సెగ్మెంట్ ఇటీవల బలమైన వృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహన విభాగంలో లెగసీ ప్లేయర్‌లు, స్టార్టప్‌లు మోడల్‌లను ప్రవేశపెడుతున్నాయి. పీఎల్ఐ, ఫేమ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మద్దతుతో పాటు ప్రోత్సహిస్తున్నాయి.

Read Also : Best Premium Flagship Phones : 2024 జనవరిలో భారత్‌లో కొనుగోలు చేయగల బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!