LPG Price Hike : పండుగ సీజన్లో సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. మీ నగరంలో కొత్త ధరలివే..
LPG Price Hike: పండుగ సీజన్లో సామాన్యులకు షాక్.. మార్చి 2వ తేదీ రంజాన్ ప్రారంభం కానుంది. ప్రభుత్వ చమురు కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరల పెంపును ప్రకటించాయి.
- Sreehari A
- Published On : March 1, 2025 / 10:48 AM IST
LPG Price Hike
LPG Price Hike : పండుగ సీజన్లో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చింది. కేంద్ర బడ్జెట్ తర్వాత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి. హోలీ, రంజాన్ నెలల్లో వంట గ్యాస్ ఖరీదైనదిగా మారింది. ప్రభుత్వ చమురు కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.
19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మార్చి 1, 2025 (శనివారం) నుంచి అమల్లోకి వచ్చాయి. ఇండియన్ ఆయిల్ మార్చి 1 నుంచి వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరను రూ.6 పెంచింది. దాంతో వాణిజ్య సిలిండర్ ధర రూ.1797 నుంచి రూ.1803కి చేరుకుంది. అయితే, 14 కిలోల గృహోపకరణ గ్యాస్ సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు. పెరిగిన కొత్త గ్యాస్ ధరలు ఈరోజు నుంచే వర్తిస్తాయి.
మీ నగరాల్లో వాణిజ్య సిలిండర్ కొత్త ధరలివే :
దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రూ.1,803కు లభిస్తుంది. గత ఫిబ్రవరిలో రూ.1,797గా ఉంది. అదేవిధంగా, ఫిబ్రవరిలో కోల్కతాలో రూ.1,907గా ఉన్న వాణిజ్య సిలిండర్ ధర రూ.1,913కు పెరిగింది.
ముంబైలో ఈ వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,755.50కు లభిస్తుంది. ఫిబ్రవరిలో ఈ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,749.50గా ఉంది. చెన్నైలో కూడా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ స్వల్పంగా పెరిగి ఇప్పుడు రూ. 1959 నుంచి రూ. 1965కి లభిస్తుంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరల పెరుగుదలతో రెస్టారెంట్లు ఫుడ్ ధరలను పెంచే అవకాశం ఉంది.
స్థిరంగా డొమెస్టిక్ వంటగ్యాస్ ధరలు :
దేశీయ 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఢిల్లీలో ఈ సిలిండర్ రూ.803 వద్ద స్థిరంగా ఉంది.
హైదరాబాద్ : రూ. 855
ఢిల్లీ : రూ. 803
లక్నో: రూ. 840.50
కోల్కతా: రూ. 829
ముంబై: రూ. 802.50
చెన్నై: రూ. 818.50
గతంతో పోలిస్తే ధరల పెంపు తక్కువ :
మార్చి నెలలో వాణిజ్య సిలిండర్ల ధరల్లో ఇదే అత్యల్ప పెరుగుదల. గత సంవత్సరం, మార్చి 1, 2024న, ఒకేసారి రూ.26 వరకు పెరుగుదల కనిపించింది. ఈసారి గ్యాస్ ధరలు రూ.6 పెరిగాయి.
