PM Kisan : రైతులకు బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ 20వ విడత విడుదల తేదీ ఇదే?.. ఖాతాలో రూ. 2వేలు పడాలంటే ఇలా చేయండి..!

PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది. రైతులు రూ. 2వేలు తమ అకౌంటులో పడాలంటే కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయాలి.

PM Kisan Scheme

PM Kisan 20th Instalment date : ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత కోసం దేశమంతటా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అర్హత కలిగిన లబ్ధిదారు (PM Kisan) రైతులు రూ. 2వేలు పడాలంటే కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసి ఉండాలి. దీనికి సంబంధించి వ్యవసాయ మంత్రిత్వ శాఖ 6 ముఖ్యమైన దశలను వివరిస్తూ కీలకమైన అడ్వైజరీని విడుదల చేసింది.

ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ తేదీని ప్రకటించలేదు. పీఎం నరేంద్ర మోదీ 20వ విడతను ఈ నెల 18న విడుదల చేసే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. గత ఏడాదిలో జూన్ విడత నెలాఖరు ముందు విడుదలైంది. రూ. 2వేలు అకౌంటులో పడాలంటే అర్హత కలిగిన రైతులు ఈ కింది పనులను తప్పక పూర్తి చేసి ఉండాలి. అవేంటో ఓసారి లుక్కేయండి..

పీఎం కిసాన్ 20వ విడత కోసం రైతులు ఏయే పనులు పూర్తి చేయాలి? :

  • e-KYC ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి.
  • ఆధార్‌ను బ్యాంక్ అకౌంటుతో లింక్ చేయండి
  • బ్యాంక్ వివరాలను వెరిఫై చేసుకోండి.
  • సరైన IFSC కోడ్, అకౌంట్ నంబర్‌ కలిగి ఉండాలి.
  • భూమి రికార్డులో తప్పులను పరిష్కరించండి.
  • భూమి యాజమాన్యాన్ని డిజిటల్‌గా వెరిఫై చేయండి.
  • లబ్ధిదారుడి స్టేటస్ చెక్ చేయండి.
  • జాబితాలో మీ పేరు ఉందో లేదో పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో చెక్ చేయండి.
  • మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయండి. OTP, నోటిఫికేషన్లు పొందవచ్చు.

20వ విడత విడుదల ఎప్పుడంటే? :
నివేదికల ప్రకారం.. ప్రధానమంత్రి మోదీ జూలై 2025లో జరిగే అధికారిక కార్యక్రమంలో 20వ విడతను విడుదల చేసే అవకాశం ఉంది. చివరి (19వ) విడత ఫిబ్రవరి 2025లో విడుదల అయింది.

20వ విడత ఆలస్యం ఎందుకంటే? :
సాధారణంగా పీఎం కిసాన్ వాయిదాలు ఫిబ్రవరి, జూన్, అక్టోబర్‌లలో విడుదల అవుతాయి. అయితే, జూన్‌లో జరగాల్సిన 20వ విడత అధికారిక కారణం లేకుండా ఆలస్యం అయింది. నివేదికల ప్రకారం.. ఈ విడత ఇప్పుడు జూలైలో విడుదల కానుంది.

పీఎం కిసాన్ ఇ-కేవైసీని ఎలా పూర్తి చేయాలి? :
పీఎం కిసాన్ వాయిదా పొందాలంటే e-KYC తప్పనిసరి. లేదంటే లబ్ధిదారులు జాబితా నుంచి తొలగిస్తారు. పీఎం కిసాన్ e-KYC ఇలా పూర్తి చేయొచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. రిజిస్టర్ చేసుకున్న రైతులు తప్పనిసరిగా eKYC పూర్తి చేసి ఉండాలి. మూడు విధాలుగా ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.
OTP-ఆధారిత e-KYC
బయోమెట్రిక్ అథెంటికేషన్
ఫేస్ అథెంటికేషన్

పీఎం కిసాన్ వాయిదా స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :

  • మీ పేమెంట్ ఆమోదం పొందిందో లేదో ఇలా చెక్ చేయొచ్చు.
  • (https://pmkisan.gov.in) విజిట్ చేయండి.
  • ‘Know Your Status’పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేయండి.
  • మీ e-KYC వెంటనే అప్‌డేట్ చేసుకోండి.

పీఎం-కిసాన్ పథకం ఏంటి? :
2019లో ప్రారంభమైన పీఎం కిసాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) పథకం. రూ. 2వేలు చొప్పున 3 సమాన వాయిదాలలో ఏడాదికి రూ.6వేలు అందిస్తుంది. అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది.
ఏప్రిల్ – జూలై
ఆగస్టు – నవంబర్
డిసెంబర్ – మార్చి

పీఎం కిసాన్ బెనిఫిట్స్ ఎవరికంటే? :

  • 20వ విడతకు అర్హత పొందాలంటే..
  • భారతీయ పౌరుడిగా ఉండాలి.
  • సొంత సాగు భూమి
  • చిన్న లేదా సన్నకారు రైతు
  • నెలకు రూ.10వేలకు పైగా ఎక్కువ పెన్షన్ ఉండకూడదు.
  • టాక్స్ చెల్లించేవారు కాకూడదు
  • సంస్థాగత భూస్వామి కాకూడదు.

ఎలా దరఖాస్తు చేయాలి? :

  • పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా పూర్తి చేయండి.
  • https://pmkisan.gov.in విజిట్ చేయండి.
  • ‘New Farmer Registration’ పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నంబర్, కాప్చాను ఎంటర్ చేయండి
  • అవసరమైన వివరాలను నింపి ‘Yes’పై క్లిక్ చేయండి.
  • ఫారమ్‌ను పూర్తి చేసి Submit చేయండి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం హార్ట్ కాపీని ప్రింట్ తీసుకోండి.
  • హెల్ప్ కోసం పీఎం కిసాన్ హెల్ప్‌లైన్‌ను 155261 లేదా 011-24300606 నంబర్లలో సంప్రదించండి.