Reels Earn Money : మీకు రీల్స్ చేయడం ఇష్టమా? ఈ ప్రభుత్వ కొత్త పథకంతో డబ్బులు సంపాదించవచ్చు.. ఎలా అప్లయ్ చేయాలంటే?

Reels Earn Money రీల్స్ చేసేవారికి గుడ్ న్యూస్.. ఇప్పుడు రీల్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం.. ప్రభుత్వం ఈ అవకాశాన్ని అందిస్తోంది.

Reels Earn Money

Reels Earn Money : రీల్స్ క్రియేట్ చేసే వారి కోసం ప్రభుత్వం ఒక కొత్త ప్రొగ్రామ్ ప్రారంభించింది. మీరు రీల్స్ క్రియేట్ చేయడం, వ్లాగింగ్ చేయడం ఇష్టపడే (Reels Earn Money) వారిలో ఒకరైతే ఇది మీకోసమే.. రీల్స్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. డిజిటల్ ఇండియా చొరవలో 10 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ‘ఎ డికేడ్ ఆఫ్ డిజిటల్ ఇండియా – రీల్ కాంటెస్ట్’ అనే కొత్త పోటీని ప్రారంభించింద. ఇందులో కంటెంట్ క్రియేటర్లు రూ. 15వేల క్యాష్ ప్రైజ్ గెలుచుకోవచ్చు.

డిజిటల్ ఇండియా మిషన్‌కు10 ఏళ్లు :
నరేంద్ర మోదీ ప్రభుత్వం డిజిటల్ ఇండియా మిషన్ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కాంపిటేషన్ ప్రవేశపెట్టారు. డిజిటల్ ఇండియా జీవితంలో తీసుకువచ్చిన సానుకూల మార్పులను ప్రదర్శించే కంటెంట్‌ను పాల్గొనేవారు క్రియేట్ చేయాలి.

Read Also : Buy Safest Cars : మీరు ఫస్ట్ టైం కారు కొంటున్నారా? రూ. 10లక్షల లోపు 5 స్టార్ రేటింగ్ 6 సేఫ్టీ కార్లు.. ఫ్యామిలీ సేఫ్టీనే ముఖ్యం..!

డిజిటల్ ఇండియా మిషన్ ఆన్‌లైన్ సర్వీసులు, ఇ-లెర్నింగ్, ఆరోగ్యం, ఆర్థిక సేవలను మెరుగుపరిచిందని భావిస్తే.. మీరు ఈ థీమ్‌లకు సంబంధించిన రీల్‌లను క్రియేట్ చేసి ప్రభుత్వానికి సమర్పించవచ్చు. మీ రీల్స్ ఎంత క్రియేటీవ్‌గా ఉంటే మీరు గెలిచే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.

ఈ పథకానికి ఎలా అప్లయ్ చేయాలంటే? :

  • పోటీలో పాల్గొనేందుకు MyGov వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
  • ‘A Decade of Digital India – Reel Contest’ ( https://www.mygov.in/task/decade-digital-india-reel-contest ) లింక్ ఓపెన్ చేయండి.
  • ఇందులో లాగిన్ అయ్యేందుకు మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
  • మీ ఇమెయిల్ అడ్స్, మొబైల్ నంబర్ లేదా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వవచ్చు.
  • దరఖాస్తు గడువు ఆగస్టు 1, 2025.
  • మీ రీల్స్ Submit చేసిన తర్వాత కన్ఫర్మేషన్ ఇమెయిల్ లేదా మెసేజ్ అందుతుంది.
  • ప్రభుత్వం టాప్ 10 రీల్స్‌ను ఎంపిక చేస్తుంది.
  • ప్రతి ఒక్కరికి రూ. 15వేలు బహుమతి లభిస్తుంది.
  • అదనంగా, 25 మంది పాల్గొనేవారికి రూ. 10వేలు, 50 మంది విజేతలకు రూ. 5వేలు అందుతాయి.
  • మొత్తంగా, 85 మంది విజేతలకు ప్రభుత్వం మొత్తం రూ. 2 లక్షలను ప్రదానం చేస్తుంది.