Sukanya Samriddhi Yojana : మీ కూతురి భవిష్యత్తు కోసం అద్భుతమైన స్కీమ్.. ఇలా పెట్టుబడి పెట్టండి.. పెళ్లినాటికి రూ. 50 లక్షలు చేతికి..!
Sukanya Samriddhi Yojana : సుకన్య సమృద్ధి యోజన (SSY)లో పెట్టుబడి ద్వారా అద్భుతమైన రాబడిని పొందవచ్చు. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటినుంచే ఇలా పెట్టుబడి పెట్టండి.. రూ. 50 లక్షల వరకు సంపాదించుకోవచ్చు.
Sukanya Samriddhi Yojana
- ఆడపిల్లల భవిష్యత్తు కోసం రూ. 50 లక్షలు ఎలా కూడబెట్టాలి?
- 6 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు
- కేవలం వడ్డీ నుంచే రూ. 50 లక్షలు సంపాదించవచ్చు
Sukanya Samriddhi Yojana : మీకు ఆడపిల్ల ఉందా? పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటినుంచే పెట్టుబడి పెట్టడం మంచిది. ఈ డబ్బులు వారి చదువులకు లేదా పెళ్లి నాటికి చేతికి అందుతాయి. అందుకే, ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన (SSY) అద్భుతమైన సేవింగ్ స్కీమ్. ప్రస్తుతం, ఈ పథకం 8.2శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
చాలా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా చిన్న సేవింగ్స్ స్కీమ్స్ కన్నా ఎక్కువ. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు చేసే పెట్టుబడులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుకు అర్హత పొందుతాయి.
తల్లిదండ్రులు కేవలం రూ. 250 కనీస మొత్తంతో కుమార్తె పేరు మీద పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ కుమార్తె వివాహం లేదా ఉన్నత విద్య కోసం రూ. 50 లక్షల ఫండ్ ఈజీగా ఎలా సంపాదించుకోవచ్చు అనేది పూర్తి వివరాలతో తెలుసుకుందాం..
రూ. 50 లక్షలు ఎలా సేవ్ చేయాలి? :
ఈ స్కీమ్ ద్వారా రూ. 50 లక్షల ఫండ్ ఏర్పాటు చేసుకోవచ్చు. పెట్టుబడిదారులు వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఆర్థిక నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
6 ఏళ్ల పాటు పెట్టుబడి అవసరం లేదు :
SSY పథకంలో 15 ఏళ్ల పెట్టుబడి తర్వాత ఎలాంటి అదనపు పేమెంట్లు అవసరం లేదు. చక్రవడ్డీ ప్రయోజనం పొందుతూ ఖాతా మరో 6 ఏళ్ల పాటు పెరుగుతూనే ఉంటుంది. చక్రవడ్డీ ద్వారా రూ. 50 లక్షలు ఈజీగా సంపాదించుకోవచ్చు.
అమ్మాయికి 18 ఏళ్లు నిండినప్పుడు జమ చేసిన మొత్తం సొమ్ములో 50శాతం మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. మిగిలిన ఫండ్స్ 21 ఏళ్ల వయస్సులో మెచ్యూరిటీ అయ్యే వరకు వడ్డీ వస్తూనే ఉంటుంది. విత్డ్రాయల్ ప్రాసెస్ కూడా అలానే ఉంటుంది.
కేవలం వడ్డీతో రూ. 50 లక్షలు సంపాదన :
ఒక వ్యక్తి తమ కుమార్తె పుట్టినప్పుడు రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెడితే వారికి 21 ఏళ్ల వయస్సు వచ్చేసరికి లేదా మెచ్యూరిటీకి సమయానికి రూ. 72 లక్షలు చేతికి అందుతాయి.
- వార్షిక పెట్టుబడి : రూ. 1,50,000
- డిపాజిట్ కాలం : 15 ఏళ్లు
- మెచ్యూరిటీ కాలం : 21 ఏళ్లు
- వడ్డీ రేటు : 8.2 శాతం
- మొత్తం డిపాజిట్ మొత్తం : రూ. 22,50,000
- వడ్డీ రాబడి : రూ. 49,32,119
- మెచ్యూరిటీపై మొత్తం : రూ. 71,82,119
