శంషాబాద్ ఎయిర్ పోర్టులో 2 కిలోల బంగారం పట్టివేత

  • Published By: chvmurthy ,Published On : March 17, 2019 / 04:16 AM IST
శంషాబాద్ ఎయిర్ పోర్టులో 2 కిలోల బంగారం పట్టివేత

Updated On : March 17, 2019 / 4:16 AM IST

హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న 2 కిలోల  బంగారాన్నిశంషాబాద్  ఎయిర్ పోర్టు లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  షార్జానుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు  వద్ద నుంచి 2.3 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ఎలక్ట్రానిక్  మెషీన్  అంతర్భాగంలో  బంగారాన్ని అమర్చి  తరలించడానికి ప్రయత్నించగా   కస్టమ్స్ అధికారులు గుర్తించి  ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.