Krishna Express Bomb : కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు.. భయాందోళనలో ప్రయాణికులు

కృష్ణా ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కృష్ణా ఎక్స్ ప్రెస్ రైల్లో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. పోలీస్ కంట్రోల్ రూమ్ కు చేశారు.

Krishna Express Bomb : కృష్ణా ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కృష్ణా ఎక్స్ ప్రెస్ రైల్లో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. పోలీస్ కంట్రోల్ రూమ్ కు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. కృష్ణా ఎక్స్ ప్రెస్ ను హైదరాబాద్ మౌలాలి దగ్గర ఆపేశారు. రైల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్ కు తరలించారు. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ.. కృష్ణా ఎక్స్ ప్రెస్ రైల్లో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. అయితే, ఎలా బాంబు కనిపించ లేదు. దీంతో ఇది ఆకతాయి పనిగా అనుమానిస్తురు పోలీసులు.

Also Read..Vande Bharat Express : వారెవ్వా వందే భారత్.. అదిరిపోయే ఫీచర్లు, రైలులో విమాన ప్రయాణం అనుభూతి

తిరుపతి నుండి ఆదిలాబాద్ వెళ్తున్న కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మరికొన్ని నిమిషాల్లో రైలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రావాల్సి ఉంది. ఆ సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి కృష్ణా ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో బాంబు పెట్టినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Also Read..Drunk Naked Man In Local Train : ఛీ ఛీ.. రైలులో దుస్తులన్నీ విప్పేసి మందుబాబు హల్ చల్

వెంటనే బాంబు స్వ్కాడ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ సిబ్బంది.. రైల్లో ముమ్మరంగా తనిఖీలు చేసింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు రావడం, సిబ్బంది రైల్లో ముమ్మరంగా తనిఖీలు చేయడం.. ఇదంతా చూసిన ప్రయాణికులు ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు. బాంబు బెదిరింపు కాల్ గురించి తెలుసుకుని ప్రయాణికులు కంగారుపడ్డారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

 

ట్రెండింగ్ వార్తలు