రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర ప్రమాదం.. పల్టీలుకొట్టిన కారు

రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం చోటు చేసుకుంది. కారు రేసింగ్ తో ఈ ప్రమాదం జరిగింది. రూయ్ రూయ్ అంటూ దూసుకొచ్చిన కారు ..

రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర ప్రమాదం.. పల్టీలుకొట్టిన కారు

Road Accident

Road Accident : రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం చోటు చేసుకుంది. కారు రేసింగ్ తో ఈ ప్రమాదం జరిగింది. రూయ్ రూయ్ అంటూ దూసుకొచ్చిన కారు పల్టీలు కొట్టింది. పిల్లర్ నెంబర్ 296 వద్ద డివైడర్ ను ఢీకొట్టిన థార్ కారు పల్టీలు కొట్టింది. ఐదు, ఆరు పల్టీలుకొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.

Also Read : ఏపీలో పింఛన్ల పంపిణీ షురూ.. లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు

ప్రమాదంలో మృతిచెందిన గణేష్ మృతదేహాన్నిపోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణం మితిమీరిన వేగమా? మద్యం మత్తులో కారు డ్రైవ్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారు నుజ్జునుజ్జు అయింది. అయితే, కారులో ఎంత మంది ప్రయాణిస్తున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది.