Biryani : బిర్యానీ రుచిగా లేదని హోటల్ సిబ్బందిపై దాడి
అత్త మీద కోపం దుత్త మీద చూపించిన చందంగా ఉంది కామారెడ్డిలో కొందరు వ్యక్తుల ప్రవర్తన. కామారెడ్డి జిల్లాలో హోటల్లో బిర్యానీ రుచిగా లేదని కొందరు వ్యక్తులు ఆహోటల్లో వంట చేసిన వ్యక్తిని, వెయిటర్లను, యజమానిని చితకబాది... ఆనక ఫర్వీచర్ ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది.
Biryani : అత్త మీద కోపం దుత్త మీద చూపించిన చందంగా ఉంది కామారెడ్డిలో కొందరు వ్యక్తుల ప్రవర్తన. కామారెడ్డి జిల్లాలో హోటల్లో బిర్యానీ రుచిగా లేదని కొందరు వ్యక్తులు ఆహోటల్లో వంట చేసిన వ్యక్తిని, వెయిటర్లను, యజమానిని చితకబాది… ఆనక ఫర్వీచర్ ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది.
కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని ఓ రెస్టారెంట్లోకి ఐదుగురువ్యక్తులు వచ్చారు. తినటానికి బిర్యానీ ఆర్డరు ఇచ్చారు. కొద్ది సేపటికి వెయిటర్ బిర్యానీ తీసుకు వచ్చి సర్వ్ చేశాడు. వారికి ఆ బిర్యానీ రుచి నచ్చలేదు. బిర్యానీ రుచిగా లేదంటూ కోపంతో ఐదుగురు వ్యక్తులు బూతులు తిడుతూ రెస్టారెంట్ యజమాని సంతోష్, కుక్, వెయిటర్లపై దాడి చేసారు.
ఈదాడిలో ఇద్దరు హోటల్ సిబ్బందికి గాయాలు అయ్యాయి. అంతటితో ఆగక రెస్టారెంట్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేసారు. దాడికి పాల్పడ్డ వారు బీబీపేట మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వారుగా యాజమాని గుర్తించాడు. రెస్టారెంట్ యజమాని సంతోష్ ఫిర్యాదుతో బీబీపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Fire Accident: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం: తృటిలో తప్పిన పెను ముప్పు