ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి, ఉరి వేసుకున్న మహిళ

చనిపోయిన వారిలో ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పటాన్‌చెరు సీఐ..

ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి, ఉరి వేసుకున్న మహిళ

Crime News: సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రుద్రారం గ్రామంలో ఆర్థిక సమస్యల కారణంగా ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి, ఉరి వేసుకుని ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. నలుగురూ మృతి చెందడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

చనిపోయిన వారిలో ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పటాన్‌చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ బలవ్మరణానికి పాల్పడానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వీరి సొంతూరు ఆత్మకూరు కాగా, కొన్నాళ్లుగా వారు రుద్రారంలో అద్దెకు ఉంటున్నారు. ఆ మహిళ భర్త ఆంజనేయులు బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. భర్తకు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఆసుపత్రిలో ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ మహిళ బలన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Also Read: మాజీ మంత్రి పేర్నినాని కారుపై దాడి..! గుడివాడలో హైటెన్షన్..