Car Hit: ఉత్తర ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ లీడర్ కారును ఢీకొట్టిందో ట్రక్కు. తర్వాత దాదాపు 500 మీటర్లకు పైగా దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన ఆదివారం రాత్రి మెయిన్పురి పట్టణంలో జరిగింది. మెయిన్పురి జిల్లా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు దేవేంద్ర సింగ్ యాదవ్.
Maharashtra: డాక్టర్ మార్నింగ్ వాక్కు వెళ్లడంతో పేషెంట్ మృతి.. వైద్యురాలిపై చర్యలు
ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆయన కారులో ఒక్కరే వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక ట్రక్కు ఆయన కారును ఢీకొంది. తర్వాత 500 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. గమనించిన స్థానికులు ట్రక్కు వెంట పరుగెడుతూ, వాహనాలపై వెళ్తూ.. ట్రక్కును ఆపే ప్రయత్నం చేశారు. కొందరు ఘటనను వీడియో తీశారు. అయితే, ఈ ఘటనలో దేవేంద్ర సింగ్ యాదవ్.. స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Malashri Daughter : హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మరో సీనియర్ నటి కూతురు
ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రైవర్ను ఇటావాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. హత్య కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
#WATCH A truck dragged the car of SP District President Devendra Singh Yadav for about 500 meters in UP’s Mainpuri pic.twitter.com/86qujRmENr
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 8, 2022