AP SSC Result 2025: విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
10వ తరగతి ఫలితాలు వచ్చాక ఇలా చెక్ చేసుకోవచ్చు..
- T Venkateshwarlu
- Published On : April 15, 2025 / 09:20 AM IST
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈనెల 22న ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 9న జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఇప్పుడు మార్కులను ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు దాదాపు 6.50 లక్షల మంది విద్యార్థులు రాశారు.
గత ఏడాది ఇదే తేదీకి..
ఏపీ పదో తరగతి ఫలితాలు గత ఏడాది కూడా ఏప్రిల్ 22నే విడుదలయ్యాయి. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ విద్యాశాఖ కమిషనర్ ఫలితాలను విడుదల చేశారు. 2024లో ఈ పరీక్షకు 6.54 లక్షల మంది విద్యార్థులు ఫీజులు చెల్లించగా, వారిలో 6.23 లక్షల మంది పరీక్షలు రాశారు.
10వ తరగతి ఫలితాలు వచ్చాక ఇలా చెక్ చేసుకోవచ్చు
- అధికారిక వెబ్సైట్ bse.ap.gov.inని ఓపెన్ చేయండి
- “SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి 2025 ఫలితాలు” లింక్పై క్లిక్ చేయండి
- మీ హాల్ టికెట్ నంబర్ను టైప్ చేయండి
- మీ ఫలితాలను చూసుకోవడానికి సబ్మిట్పై క్లిక్ చేయండి
- మార్క్ షీట్ను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి
