AP SSC Result 2025: విద్యార్థులకు అలర్ట్‌.. పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..

10వ తరగతి ఫలితాలు వచ్చాక ఇలా చెక్‌ చేసుకోవచ్చు..

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈనెల 22న ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 9న జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఇప్పుడు మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు దాదాపు 6.50 లక్షల మంది విద్యార్థులు రాశారు.

Also Read: కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా? నథింగ్ ఫోన్ 3ఏ, నథింగ్ ఫోన్ 3ఏ ప్రోలో ఏది బెస్ట్‌? ఫుల్‌ డీటెయిల్స్..

గత ఏడాది ఇదే తేదీకి..
ఏపీ పదో తరగతి ఫలితాలు గత ఏడాది కూడా ఏప్రిల్ 22నే విడుదలయ్యాయి. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ విద్యాశాఖ కమిషనర్ ఫలితాలను విడుదల చేశారు. 2024లో ఈ పరీక్షకు 6.54 లక్షల మంది విద్యార్థులు ఫీజులు చెల్లించగా, వారిలో 6.23 లక్షల మంది పరీక్షలు రాశారు.

10వ తరగతి ఫలితాలు వచ్చాక ఇలా చెక్‌ చేసుకోవచ్చు

  • అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.inని ఓపెన్ చేయండి
  • “SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి 2025 ఫలితాలు” లింక్‌పై క్లిక్ చేయండి
  • మీ హాల్ టికెట్ నంబర్‌ను టైప్‌ చేయండి
  • మీ ఫలితాలను చూసుకోవడానికి సబ్మిట్‌పై క్లిక్ చేయండి
  • మార్క్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి