Joe Biden Visit Israel : రేపు ఇజ్రాయెల్లో జో బిడెన్ పర్యటన…గాజా పౌరులకు మానవతా సాయంపై చర్చ
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం ఇజ్రాయెల్ దేశంలో పర్యటించనున్నారు. హమాస్ దాడి తర్వాత దెబ్బతిన్న ఇజ్రాయెల్ దేశాన్ని జో బిడెన్ సందర్శించనుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రేపు ఇజ్రాయెల్లో పర్యటించనున్న జో బిడెన్, ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరుపనున్నారు....
Joe Biden Visit Israel : అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం ఇజ్రాయెల్ దేశంలో పర్యటించనున్నారు. హమాస్ దాడి తర్వాత దెబ్బతిన్న ఇజ్రాయెల్ దేశాన్ని జో బిడెన్ సందర్శించనుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రేపు ఇజ్రాయెల్లో పర్యటించనున్న జో బిడెన్, ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరుపనున్నారు. హమాస్ దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం ఇజ్రాయెల్కు సంఘీభావం తెలుపుతారని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు.
Also Read : Sundar Pichai thanks PM Modi : ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ భేటీ…ఏం చర్చించారంటే…
గాజాకు సహాయం చేయడం కోసం ఇజ్రాయెల్, వాషింగ్టన్లు ఒక ప్రణాళికను రూపొందించడానికి అంగీకరించినట్లు ఆంటోని చెప్పారు. అక్టోబరు 7న హమాస్ జరిపిన దాడుల తర్వాత అమెరికా అగ్ర దౌత్యవేత్త ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో 8 గంటలపాటు సమావేశమైన తర్వాత బ్లింకెన్ మాట్లాడారు. గాజాలోని పౌరులకు మానవతా సహాయం అందించే విధంగా తన కార్యకలాపాలను నిర్వహించాలని ఆశిస్తున్నట్లు బ్లింకెన్ చెప్పారు.
Also Read : Manipur : మణిపూర్ కేసులో ఆరుగురిపై సీబీఐ చార్జిషీట్
గాజా పౌరులకు హాని జరగకుండా ఉండేందుకు వీలుగా ఇరుపక్షాలు చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు. జో బిడెన్ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్కు వస్తున్నట్లు బ్లింకెన్ ప్రకటించారు. ఇజ్రాయెల్ గాజాపై గ్రౌండ్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. టెల్ అవీవ్లో ఉన్న బ్లింకెన్, గాజాకు సహాయంపై యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ ఒప్పందం కుదుర్చుకున్నాయని కూడా ప్రకటించారు.
Also Read : Pune Accident : పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం…నలుగురి మృతి, ఇద్దరికి గాయాలు