సంచలన నిర్ణయం : వన్డే క్రికెట్కు క్రిస్ గేల్ గుడ్ బై
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచకప్ తర్వాత వన్డే క్రికెట్కు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మెగా ఈవెంటే తన వన్డే కెరీర్లో

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచకప్ తర్వాత వన్డే క్రికెట్కు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మెగా ఈవెంటే తన వన్డే కెరీర్లో
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచకప్ తర్వాత వన్డే క్రికెట్కు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మెగా ఈవెంటే తన వన్డే కెరీర్లో చివరిదని స్పష్టం చేశాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు దీన్ని ధృవీకరించింది. 2019, మేలో ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్కప్ టోర్నీ జరగనుంది. గేల్ కు అదే చివరి టోర్నీ. ప్రస్తుతం ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు సిద్ధమవుతున్న ఈ కరీబియన్ స్టార్.. ఊహించని విధంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. విండీస్ తరఫున 284 వన్డేలు ఆడిన ఈ జమైకన్ 37.12 సగటుతో 9వేల 727 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
39 ఏళ్ల గేల్ 1999 సెప్టెంబర్లో భారత్పై టొరంటో వేదికగా జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. వన్డే ఫార్మాట్లో బ్రియాన్ లారా (10,405) తర్వాత అత్యధిక పరుగులు చేసిన వెస్టిండీస్ బ్యాట్స్మన్ క్రిస్ గేలే. అంతేకాదు వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన (2015 వరల్డ్కప్లో జింబాబ్వేపై) ఏకైక వెస్టిండీస్ క్రికెటర్ గేలే. 20 ఏళ్ల కెరీర్ ఉన్నప్పటికీ వెస్టిండిస్ బోర్డుతో విభేదాల కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. గేల్ చివరగా 2018 జులైలో వన్డే ఆడాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఆడనున్నాడు. ప్రపంచకప్లో బరిలోకి దిగి.. అంతటితో ఈ ఫార్మాట్కు గుడ్బై చెప్పనున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ల్లో మాత్రం గేల్ కంటిన్యూ అవుతున్నాడు. టీ20 ఫార్మాట్లో క్రిస్ గేల్ సుడిగాలి ఇన్నింగ్స్కు వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ ఉన్నారు. వన్డేలకు గుడ్బై చెప్పనున్న గేల్.. టీ20ల్లో కంటిన్యూ అవుతాడా లేదా అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు.