కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 163 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. రోజు రోజుకి
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 163 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. రోజు రోజుకి కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 7వేల 965మంది చనిపోయారు. అలాగే కరోనా బారిన పడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. లక్ష 98వేల 178 మంది కరోనా బారిన పడ్డారు. 7వేల 20మందికి సీరియస్ గా ఉంది.
చైనాలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో ఇటలీ, ఇరాన్, స్పెయిన్ లో ఒక్కసారిగా కరోనా విజృంభించడం కలకలం రేపుతోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 2019 డిసెంబర్ లో చైనాలో వుహాన్ లో కరోనా వెలుగు చూసింది. ఇప్పటివరకు వ్యాక్సిన్ కానీ మందు కానీ కనిపెట్టలేకపోయారు.
See Also | కరోనా రాకాసి : ఇటలీలో 2500 మంది మృతి
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను క్రమంగా కమ్మేస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచం విలవిలలాడుతోంది. దాన్ని నియంత్రించటానికి ఆయా దేశాలు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాయంటే కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. భారత్ లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనాను డబ్ల్యూహెచ్ వో మహమ్మారిగా గుర్తించింది. మన దేశం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది.
కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మార్చి 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. అలాగే థియేటర్లు, పబ్ లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేశారు. పార్లమెంట్ సముదాయంలోకి సందర్శకులకు ఎంట్రీ నిషేధించారు. అంతర్జాతీయ సరిహద్దుల దగ్గర ఆంక్షలు విధించారు. కరోనా పై హైఅలర్ట్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, కొత్త హెల్ప్ లైన్ నెంబర్ 011-24300666 అందుబాటులోకి తెచ్చింది.
* ప్రపంచవ్యాప్తంగా 7వేల 965కి చేరిన కరోనా వైరస్ మృతుల సంఖ్య
* లక్షా 98వేల 178మంది కరోనా బాధితులు
* 7వేల 20మందికి సీరియస్
* 163 దేశాలకు పాకిన వైరస్
* భారత్ లో కరోనాతో ముగ్గురు మృతి
* భారత్ లో 142 పాజిటివ్ కేసులు
* మహారాష్ట్రలో 39 కేసులు
* కేరళలో 26 కేసులు
* యూపీలో 15 కేసులు
* హర్యానాలో 15 కేసులు
* కర్నాటకలో 11 కేసులు
* ఢిల్లీలో 8 కేసులు
* లడఖ్ లో 6 కేసులు
* తెలంగాణ 5 కేసులు
* రాజస్తాన్ 4 కేసులు
* జమ్ముకశ్మీర్ లో 3 కేసులు
* ఉత్తరాఖండ్, పంజాబ్, ఒడిశా, ఏపీ, తమిళనాడులో ఒక్కో కేసు నమోదు.
See Also | భారత్లో కరోనా..@142 కేసులు