ఈ వైరస్ కరోనా కన్నా డేంజరస్, ప్రపంచ జనాభాలో సగం మంది చనిపోతారు, సైంటిస్ట్ వార్నింగ్

అసలే యావత్ ప్రపంచం కరోనా వైరస్ దెబ్బకు ప్రాణ భయంతో బతుకుంటే, ఇప్పుడు అమెరికా సైంటిస్ట్,

  • Publish Date - May 31, 2020 / 12:05 PM IST

అసలే యావత్ ప్రపంచం కరోనా వైరస్ దెబ్బకు ప్రాణ భయంతో బతుకుంటే, ఇప్పుడు అమెరికా సైంటిస్ట్,

అసలే యావత్ ప్రపంచం కరోనా వైరస్ దెబ్బకు ప్రాణ భయంతో బతుకుంటే, ఇప్పుడు అమెరికా సైంటిస్ట్, పౌష్టికాహార డాక్టర్ మైఖేల్ గ్రెగర్ మరో బాంబు పేల్చారు. ‘కరోనా వైరస్’ కన్నా అతి భయంకరమైన వైరస్(బర్డ్ ఫ్లూ లాంటిది) ఒకటి ప్రపంచాన్ని వణికించే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ బర్డ్ ఫ్లూ కారణంగా ప్రపంచ జనాభాలోని సగం మందిని కోల్పోతామని తెలిపారు. అంటు వ్యాధులను ఎలా నివారించాలి?(How To Survive a Pandemic) అనే కొత్త పుస్తకం డాక్టర్ మైఖేల్ గ్రెగర్ రాశారు. అందులో శాఖాహారం ప్రయోజనాలను వివరించారు. జంతువుల మాంసం వల్ల అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయని.. ఈ కారణంగా మొత్తం మానవ జాతికి ముప్పు ఉంటుందన్నారు. జంతువుల పెంపకం, వాటి వేట, మాంసాన్ని తినడం మావనాళిని ప్రమాదంలో పడేస్తుందనేది ఆయన వాదన.

జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే చాలా వైరస్‌లు ఎటువంటి హాని కలిగించవు. కానీ క్షయ, సార్స్ వంటి కొన్ని రకాల వైరస్‌లు మాత్రం చాలా వేగంగా పెరుగుతాయన్నారు. నిజానికి అవి చాలా ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించారు. కాగా ఆయన రాసిన బుక్‌లో ముఖ్యంగా చికెన్ కారణంగా వైరస్ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు.

చికెన్ లో వైరస్ వచ్చే ప్రమాదం ఎక్కువ:
నేటి పశు వ్యవసాయంలో కోళ్ల పెంపకం పెద్ద భాగమైంది. ఇఫ్పుడు దాదాపు అన్ని దేశాల్లో కోడి గుడ్లు ఎక్కువగానే తింటున్నారు. ఇక ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. కోళ్లను చాలా క్రూరంగా బోనులో ఉంచుతారు. వాటికి రసాయనాలు కలిగిన ఆహారాలు ఇస్తారు. ఈ కారణంగానే చికెన్‌లో వైరస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని డాక్టర్ మైఖేల్ గ్రెగర్ అభిప్రాయ పడ్డారు. ఎక్కువ సంఖ్యలో ఎంత క్రూరంగా మనం చికెన్ తయారు చేస్తున్నామో.. వైరస్ వ్యాప్తి కూడా అంతే స్థాయిలో ఎక్కువగా ఉంటుందని బుక్‌లో తెలిపారు. ఇది మహమ్మారిని ఆహ్వానించడం లాంటిదన్నారు డాక్టర్ మైఖేల్.

చరిత్రలో అత్యంత భయంకరమైనది స్పానిష్ బర్డ్ ఫ్లూ:
‘ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా దీన్నే స్పానిష్ బర్డ్ ఫ్లూ’ అని పిలుస్తారు. 1918-1920 మధ్య ప్రపంచ జనాభాలో మూడింట.. ఒక వంతు మందికి సోకింది. మొత్తం 10 శాతం మరణాలు ఈ కారణంగానే జరిగాయి. ఇది చరిత్రలో అత్యంత భయంకరమైన అంటువ్యాధిగా నమోదు చేయబడింది. కాగా 1997లో హాంకాంగ్ లో పక్షుల మార్కెట్ లో వెలుగుచూసిన H5N1 అనే కొత్త రకం బర్డ్ ఫ్లూ ఆ దేశంలో భయంకరమైన వినాశనాన్ని కలిగించిందన్నారు.

కొత్త H5N1 మరింత ప్రమాదకరం:
కొత్త H5N1 మరింత ప్రమాదకరంగా ఉంటుందన్నారు నిపుణులు. దీని ద్వారా ఎక్కువ మరణాలు సంభవిస్తాయని, మొత్తం మానవ జాతికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. H5N1 లంగ్స్‌ను ప్రభావితం చేస్తుంది. కానీ దాని కొత్త వైరస్ శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది మునుపటి కంటే పది రెట్లు వేగంగా మారుతుంది. ఇది 1918 మహమ్మారి కంటే ప్రమాదకరమైనది కావచ్చు. ఈ కారణంగా మరణాల రేటు 50 శాతం ఉంటుంది. అందువల్ల, మొత్తం ప్రపంచంలోని సగం జనాభాకు ఇది ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. చైనాలోని వుహాన్ మాంసం మార్కెట్ లోని జంతువుల మాంసం ద్వారా కరోనా వైరస్ సంక్రమించి, మానవుల శరీరంలోకి ప్రవేశించిందని డాక్టర్ గ్రెగర్ అంటారు. కాగా, చికెన్ వల్ల కరోనా సోకదని పలువురు నిపుణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈయనేమో చికెన్ నుంచి వైరస్ చాలా డేంజర్ అని, ప్రపంచ జనాభాలో సగంమంది పోతారని అంటున్నారు. దీంతో ఏది నిజమో.. ఏది కాదో తెలీక జనాలు తలలు పట్టుకుంటున్నారు. అసలే జనాలు కరోనా భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇలాంటి మహమ్మారిని జీవితంలో ఎప్పుడూ చూడలేదని వాపోతున్నారు. ఈ కరోనా నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ కన్నా డేంజర్ వైరస్ తో మానవ జాతికి ముప్పు పొంచి ఉందని, ప్రపంచ జనాభాలో సగంమంది పోతారని చెప్పడం మరింత ఆందోళన పెంచింది.