ఉత్తరకొరియా నియంత “కిమ్” కన్నుమూత!

  • Published By: venkaiahnaidu ,Published On : August 24, 2020 / 04:32 PM IST
ఉత్తరకొరియా నియంత “కిమ్” కన్నుమూత!

Updated On : August 24, 2020 / 4:51 PM IST

ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్-ఉన్ కోమాలో ఉన్నట్లు, అతని సోదరి కిమ్ యో-జోంగ్ దేశ పగ్గాలు చేపట్టడానికి సిద్దమైనట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, కిమ్ జోంగ్-ఉన్ చనిపోయాడని ఉత్తరకొరియా వ్యవహారాలు బాగా తెలిసిన ఒక నిపుణుడు తెలిపారు.



కిమ్ జోంగ్-ఉన్ చనిపోయాడని తాను నమ్ముతున్నానని ఉత్తరకొరియా దేశవ్యాప్తంగా పర్యటించిన రాయ్ కాలీ అనే జర్నలిస్ట్ అన్నారు. కిమ్ జోంగ్-ఉన్ యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి ఉత్తర కొరియా అస్పష్టంగా ఉండటం దేశంలో పెద్ద కార్యాచరణ మార్పులు చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.



ఉత్తర కొరియాలో ప్రజలకు విడుదల చేయబడిన సమాచారం లేదా తప్పుడు సమాచారం పెద్దగా ఏదో జరుగుతోందని సూచిస్తుంది, కిమ్ జోంగ్-ఉన్ లేదా ఇతర నాయకుల విషయానికి వస్తే ప్రజలకు సమాచారాన్ని బహిర్గతం చేయడంలో దేశం ఎప్పుడూ నిర్దిష్టంగా లేదని ఆయన అన్నారు.

ఈ సందర్భగా కిమ్ తండ్రి.. కిమ్ జోంగ్-ఇల్ మరణించిన సమయాన్ని కూడా రాయ్ కాలీ గుర్తు చేశారు. కిమ్ జోంగ్-ఇల్ మరణించిన కొన్ని నెలల తర్వాత అయన చనిపోయినట్లు ఉత్తరకొరియా అధికారికంగా ప్రకటన చేసిందని అయన అన్నారు. ఇప్పుడు కూడా కిమ్ జోంగ్-ఉన్ సోదరి దేశం బాధ్యతలు స్వీకరించినప్పుడు అయన చనిపోయారన్న విషయం స్పష్టమవుతుందని రాయ్ కాలీ అన్నారు.



మరోవైపు, దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే-జంగ్ మాజీ సహాయకుడు చాంగ్ సాంగ్-మిన్ ఇటీవల కిమ్ జోంగ్-ఉన్ కోమాలో ఉన్నారని తాను నమ్ముతున్నానని, అయితే అతని జీవితం అంతం కాలేదు అని చెప్పాడు. కొన్ని వారాలుగా ప్రజలలో కనిపించనప్పుడు ఉత్తర కొరియా నాయకుడి మరణం గురించి పుకార్లు వెల్లువెత్తడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.