Vyooham : ‘వ్యూహం’ మూవీ ప్రమోషన్స్కి.. అమితాబ్ని వాడేస్తున్న ఆర్జీవీ..
'వ్యూహం' మూవీ ప్రమోషన్స్కి బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కి కూడా వాడేసుకుంటున్నారు.
Vyooham : బయోపిక్ కాదు రియల్ పిక్ తీసుకువస్తానంటూ టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. రూపొందించిన సినిమాలు ‘వ్యూహం’, ‘శపథం’. గత పదేళ్లుగా ఏపీ రాజకీయాల్లో జరిగిన విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు వర్మ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనలను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించబోతున్నారు.
ఇక ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాలు.. ఇప్పుడు రిలీజ్ కి డేట్ ని లాక్ చేసుకున్నాయి. ‘వ్యూహం’ మూవీ మార్చి 2న, శపథం మార్చి 8న ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ని మొదలుపెట్టిన ఆర్జీవీ.. తనదైన స్టైల్ లో నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ ప్రమోషన్స్ కోసం ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ని కూడా ఆర్జీవీ ఉపయోగించేసుకుంటున్నారు.
Also read : Rajinikanth : 43ఏళ్ళ దాంపత్యం.. ప్రతి ఏడాది పెళ్లిరోజున రజినీకాంత్ దంపతులు ఏం చేస్తారో తెలుసా..!
అమితాబ్ రీసెంట్ గా ఆర్జీవీ డెన్ కి వచ్చారట. ఇక అక్కడ వ్యూహం మూవీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అండ్ వర్మతో అమితాబ్ భేటీ అయ్యారు. సినిమా విషయాలతో పాటు కాసేపు సరదాగా కూడా మాట్లాడుకున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోటోని వర్మ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వ్యూహం మూవీ ప్రమోషన్స్ కి ఉపయోగించేసుకుంటున్నారు.
SARKAR @SrBachchan in MY SEAT at RGV DEN pic.twitter.com/WxUoMIqJuc
— Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024
అయితే విషయం ఏంటంటే.. అమితాబ్ ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన అమితాబ్.. తన పాత మిత్రుడు వర్మని కలుసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.
Me and Dasari Kiran Kumar VYOOHAM ing with SARKAR Amitabh Bachchan at RGV DEN ??? pic.twitter.com/jnboZKlhHc
— Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024
ఇక వ్యూహం విషయానికి వస్తే.. వైస్సార్ చనిపోయిన తరువాత జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు, ఆ తరువాత ఎలా సీఎం అయ్యారు అనేది చూపించబోతున్నారు. ఈక్రమంలోనే మూవీలో జగన్ ప్రత్యర్థులు అయిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాత్రలను కూడా వర్మ చూపించనున్నారు.