‘అమృతం’ (అద్వితీయం) మళ్లీ వస్తోందోచ్..

ఈ ఉగాదికి zee5 తమ ప్రేక్షకులందరికీ ‘అమృతం ద్వితీయం’ ద్వారా షడ్రుచుల అమృతాన్ని వడ్డించబోతుంది..

  • Published By: sekhar ,Published On : February 25, 2020 / 06:22 AM IST
‘అమృతం’ (అద్వితీయం) మళ్లీ వస్తోందోచ్..

Updated On : February 25, 2020 / 6:22 AM IST

ఈ ఉగాదికి zee5 తమ ప్రేక్షకులందరికీ ‘అమృతం ద్వితీయం’ ద్వారా షడ్రుచుల అమృతాన్ని వడ్డించబోతుంది..

భారత దేశపు అతి పెద్ద కాంటెక్ టెక్నాలజీ బ్రాండ్ అయిన zee5 నెటవర్క్ ప్రేక్షకులకి ఎల్లప్పుడూ ఉన్నత కంటెంట్‌ను అందించడంలో ముందంజలో ఉంటుంది. అన్ని భాషల్లోనూ, అన్ని జోనర్స్‌లోను ఒరిజినల్స్ యొక్క అతి పెద్ద సృష్టికర్త zee5 మరియు Lightbox Media అధినేత గుణ్ణం గంగరాజు కలిసి ‘అమృతం ద్వితీయం’ (అద్వితీయం) నిర్మించడం జరుగుతుంది. (మూర్ఖత్వానికి మరణం రాదు) అనే ఫన్నీ ట్యాగ్ లైన్ పెట్టారు.

‘అమృతం’ 2001 లో సిట్ కామ్‌గా ప్రారంభమై బుల్లి తెర వీక్షకులకు హాస్యాన్ని పంచి పెట్టింది. ఆంజనేయులు, అమృత రావు అనే ఇద్దరు స్నేహితులు కలిసి తమ రెస్టారెంట్ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి విన్నూత్నమైన ఐడియాస్ వేస్తుంటారు కానీ వాటిని అనుకోని సంఘటనలు, సందర్భాలు పలకరించడంతో చతికిలపడుతుంటారు. ఈ సిట్ కామ్‌లో శివాజీ రాజా, నరేష్, హర్ష వర్ధన్, గుండు హనుమంత రావు ప్రధాన పాత్రల్లో నటిస్తే, వాసు ఇంటూరి, సర్వం అనే నమ్మకస్తుడైన పనివాడి పాత్ర పోషించగా, శివన్నారాయణ హింసించే ఇంటి ఓనర్ అప్పాజీ పాత్రలో నటించారు.

 

‘అమృతం’ బుల్లి తెరపై వీక్లీ సీరియల్‌గా ఆరు సంవత్సరాలపాటు ప్రసారమైంది. పదమూడు సంవత్సరాల తరువాత మళ్ళీ లొల్లి చెయ్యడానికి, ప్రేక్షకులను కవ్వించి నవ్వించడానికి Lightbox Media ప్రీమియర్ ఎక్సక్లూసివ్‌గా zee5లో ప్రసారం కాబోతుంది.

అమృతం ద్వితీయం లో హర్షవర్ధన్, శివన్నారాయణ, వాసు ఇంటూరి, రాగిణి పూర్వ పాత్రలే పోషించగా, L.B శ్రీరామ్ అంజి పాత్రలో, సత్య క్రిష్ణ అమృతం భార్య సంజీవిని పాత్రలో కనబడనున్నారు. కాశీ విశ్వనాథ్ మరియు రాఘవ కీలకమైన పాత్రలు పోషించారు. ఈ ఉగాది నుంచి మీ zee5 లో మొదటి ఆట..