Bigg Boss 7 Day 83 Promo
బిగ్బాస్ తెలుగు సీజన్ 7 చివరి దశకు వచ్చేసింది. సీజన్ ముగిసేందుకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే హౌస్లో ఉన్నారు. ఇక శనివారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. గతవారం చెప్పినట్లుగానే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున మరోసారి చెప్పారు.
ఈ వారంలో కంటెస్టెంట్లు చేసిన తప్పులపై నాగార్జున మండిపడ్డాడు. ముందుగా రైతు బిడ్డను ప్రశాంత్ ను కడిగిపారేశాడు. ‘మర్డర్ అయిపోవావు.. దయ్యం అయ్యావు సరే.. దయ్యం అయ్యాక కూడా ఆ బూతులు ఏంటి..? ప్రశాంత్.’ అని నాగార్జున ప్రశ్నించాడు. దీనికి ప్రశాంత్ మౌనంగా ఉండగా ‘నామినేషన్స్ లో అలా.. ఇలా.. అని మాట్లాడుతావుగా ఇప్పుడు మాట్లాడు.’ అని కింగ్ అన్నాడు. ‘నేను కావాలని అనలేదు అని, తప్పైతే క్షమించాలని.’ అని ప్రశాంత్ అనగా.. ఎవ్వరు కావాలని అనరు అని నాగ్ చెప్పాడు.
Tillu Square : టిల్లు గాడు సెకండ్ సింగిల్ని తీసుకొచ్చేశాడు.. రాధిక రింగులు జుట్టుకి..
ఆ తరువాత ఈ వారం సింగిల్ ఎలిమినేషనా..? డబుల్ ఎలిమినేషనా..? అని అశ్వినినీ ప్రశ్నించారు నాగ్. డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా నువ్వు సెల్ప్ నామినేషన్ ఎందుకు చేసుకున్నావ్ అని అడిగారు. కాన్ఫిడెన్స్ లేదా ఓవర్ కాన్ఫిడెన్సా, మనం చేసే పొరబాట్ల మూలంగానే మనం బలైపోతాం అని నాగార్జున అన్నాడు. మొత్తంగా ప్రొమో చూస్తుంటే కంటెస్టెంట్లకు నాగార్జున కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నాడని అర్థం అవుతోంది.