Demon Slayer: ముంబైలో డీమన్ స్లేయర్ స్క్రీనింగ్‌.. థియేటర్లో రష్మిక, టైగర్‌ హంగామా.. ఫ్యాన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్

యనిమే ఫ్యాన్స్ కోసం ముంబైలో ఘనంగా 'డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాసిల్'(Demon Slayer) సినిమా స్క్రీనింగ్.

Demon Slayer: ముంబైలో డీమన్ స్లేయర్ స్క్రీనింగ్‌.. థియేటర్లో రష్మిక, టైగర్‌ హంగామా.. ఫ్యాన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్

Demon Slayer movie special screening in Mumbai

Updated On : September 8, 2025 / 5:10 PM IST

Demon Slayer: ముంబైలో ‘డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాసిల్’ సినిమా స్క్రీనింగ్ ఘనంగా జరిగింది. యనిమే ఫ్యాన్స్ కోసం ఈ స్పెషల్ స్క్రీనింగ్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఇక ఈ స్పెషన్ స్క్రీనింగ్ కి స్టార్ హీరోయిన్ రష్మిక, బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ హాజరయ్యారు. ఫ్యాన్స్ తో కలిసి థియేటర్ లో హంగామా చేశారు. ఈ ఈవెంట్ కి రష్మిక టాంజిరో, నెజుకో సోదర సోదరీమణులకి ప్రేరణగా నిలిచే ప్రత్యేకమైన జపనీస్ డ్రస్సులో హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి ఆడియన్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

Bellamkonda Srinivas: ఇండస్ట్రీలో ఎవరి స్వార్ధం వాళ్లదే.. స్వచ్ఛమైన స్నేహం దొరకడం కష్టం.. అందుకే ఇలా!

ఇక మన దేశంలో దాదాపు 750కి పైగా స్క్రీన్స్‌లో డీమన్ స్లేయర్(Demon Slayer) విడుదలకాబోతోంది. నిజానికి, ఓ యనిమే సినిమా ఈ రేంజ్ లో రిలీజ్ అవడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమా కోసం ఇండియన్ ఆడియన్స్ చాలా కాలంలో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. యనిమే ఫ్యాన్స్ కోసం క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా సంయుక్తంగా ఈ క్రేజీ సినిమాను రిలీజ్ చేస్తున్నాయు. సెప్టెంబరు 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.