నా ఫ్యామిలీ సేఫ్.. కరోనా పరీక్షల్లో నెగెటివ్..

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. 2 వారాల క్వారంటైన్ పూర్తయిందని, ప్రస్తుతం తమ కుటుంబంలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని ఆయన ట్వీట్ చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. అందరికీ నెగిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు.
Completed 2 weeks of quarantine! No symptoms. Tested just for the sake of it… It is negative for all of us…
Doctor said we need to wait 3 weeks from now to see if we’ve developed enough antibodies for plasma donation!— rajamouli ss (@ssrajamouli) August 12, 2020
ప్లాస్మాను దానం చేయడానికి సరిపడా యాంటీబాడీస్ ఏర్పడటానికి 3 వారాల సమయం పడుతుందని, అప్పటివరకూ వేచి ఉండమని డాక్టర్ సూచించినట్లు ఆయన తెలిపారు. తనతో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు జూలై 29న రాజమౌళి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
??????????? https://t.co/bEBJv8IXbA
— PURIJAGAN (@purijagan) August 12, 2020
లక్షణాలు తక్కువగానే ఉండటంతో వారంతా అప్పటి నుంచి హోం ఐసోలేషన్లోనే ఉన్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్లాస్మాను దానం చేస్తామని ఆ సమయంలోనే రాజమౌళి ప్రకటించారు. రాజమౌళితో సహా ఆయన కుటుంబం సభ్యులందరికీ నెగెటివ్ రావడంతో పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.