రూ.100 కోట్ల క్లబ్లో ‘ఖైదీ’
కార్తీ నటించిన ‘ఖైదీ’ విడుదలైన 17 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లు గ్రాస్ వసూలు చేసింది..

కార్తీ నటించిన ‘ఖైదీ’ విడుదలైన 17 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లు గ్రాస్ వసూలు చేసింది..
కార్తీ నటించిన తమిళ సినిమా.. ‘ఖైదీ’.. దీపావళి కానుకగా అక్టోబర్ 25న తెలుగు, తమిళ్ భాషల్లో భారీగా విడుదలైంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ‘ఖైదీ’ మూవీకి అన్నిచోట్ల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
కల్ట్ క్లాసిక్ మూవీ, హీరోయిన్, పాటలు వంటి కమర్షియల్ అంశాలకు పోకుండా జెన్యూన్గా తీసిన సినిమా.. అంటూ ప్రేక్షకులు, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.. మూడో వారంలోనూ అత్యధిక థియేటర్లలో నడుస్తోంది ఖైదీ..
Read Also : ‘మార్కెట్ రాజా M.B.B.S.’ నవంబర్ 29 విడుదల
రీసెంట్గా ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్లోకి ఎంటరైంది. విడుదలైన 17 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసిందీ చిత్రం.. కేరళలో అత్యధిక కలెక్షన్లు సాధించిన తమిళ సినిమాల లిస్టులో మూడో స్ధానంలో ఉంది ‘ఖైదీ’. త్వరలో ఈ సినిమాకి సీక్వెల్ రానుంది..