సింపుల్గా కృష్ణవంశీ కొత్త సినిమా ‘రంగమార్తాండ’ ప్రారంభం
ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధానపాత్రధారులుగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న‘రంగమార్తాండ’ షూటింగ్ ప్రారంభం..

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధానపాత్రధారులుగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న‘రంగమార్తాండ’ షూటింగ్ ప్రారంభం..
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ.. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధానపాత్రధారులుగా ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. బ్రహ్మానందం డిఫరెంట్ క్యారెక్టర్ చేయనున్న ఈ సినిమాను రెడ్ బల్బ్ మూవీస్, ఎస్వీఆర్ గ్రూప్, హౌస్ఫుల్ మూవీస్ బ్యానర్స్పై.. అభిషేక్ జవకర్, మధు కలిపు నిర్మించనున్నారు. ‘నటసామ్రాట్’ అనే మరాఠీ సినిమాకు ‘రంగమార్తాండ’ అఫీషియల్ రీమేక్.
‘నటసామ్రాట్’ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నటుడు, తెలుగులో ‘ఒక్కడున్నాడు’, ‘హోమం’, ‘అదుర్స్’, ‘డాన్ శీను’,‘గుంటూరు టాకీస్’, ‘సాహో’ వంటి సినిమాలలో నటించిన మహేష్ మంజ్రేకర్ డైరెక్ట్ చెయ్యగా.. ‘వెర్సటైల్ యాక్టర్’ నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించారు. ‘రంగమార్తాండ’ షూటింగ్ సోమవారం విశాఖపట్నంలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని కృష్ణవంశీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఆస్ట్రాలజర్ బాలు మున్నంగి క్లాప్ కొట్టగా, నిర్మాత మధు కలిపు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కృష్ణవంశీ చిరకాల మిత్రుడు, దర్శకుడు తేజ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. 2004లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర చేశారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ భర్త దర్శకత్వంలో రమ్యకృష్ణ యాక్ట్చేయబోతున్నారు. అప్పుడు గెస్ట్రోల్చేసిన రమ్యకృష్ణ ఇప్పుడు పూర్తిస్థాయి పాత్ర చేయనుండడం విశేషం. ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతమందిస్తున్నారు.