ఇటీవలే కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా నుంచి ‘ఏంటమ్మా..’ అనే సాంగ్ విడుదలైంది. తెలుగు, హిందీ భాషల్లో కలిపి ఈ పాట ఉంది. ఈ పాటలో చరణ్ కూడా ఎంట్రీ ఇచ్చి వెంకటేష్, సల్మాన్ తో కలిసి మాస్ స్టెప్పులు వేశాడు. ఇందులో లుంగీ అనే పదం వాడి స్టెప్పులు వేయించారు. అయితే ఇప్పుడు ఈ పాటపై విమర్శలు వస్తున్నాయి.
Shruti Haasan : శృతిహాసన్ పై ఫైర్ అవుతున్న టాలీవుడ్ ఆడియన్స్..
మాజీ టెస్ట్ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఈ పాటని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ పాటలో సౌంత్ ఇండియన్ కల్చర్ ని దారుణంగా అవమానించారు. అది లుంగీ కాదు, ధోతి. సౌత్ ఇండియాలో సాంప్రదాయంగా కట్టుకునేది. దాన్ని ఇంత ఘోరంగా చూపించారు అని కామెంట్స్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కి మద్దతుగా అనేకమంది మరిన్ని కామెంట్స్ చేస్తూ ఈ పాటపై విమర్శలు చేశారు. కొంతమంది.. ఇది గుడిలో తీసిన సాంగ్, గుడిలో షూస్ వేసుకొని డ్యాన్స్ చేశారు అంటూ విమర్శించారు. మరి ఈ పాటపై వచ్చిన విమర్శలకు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.
This is highly ridiculous and degrading our South Indian culture. This is not a LUNGI , THIS IS A DHOTI. A classical outfit which is being shown in a DISGUSTING MANNER https://t.co/c9E0T2gf2d
— Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) April 8, 2023