కొత్త బిజినెస్.. MB OTT?..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సొంతగా ఓటీటీ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సొంతగా ఓటీటీ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం..
లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన స్టార్స్ కొత్త సినిమాలకోసం ప్రిపేర్ అవుతూ.. ఇష్టమైన పనులు చేస్తూ.. బిజినెస్ వ్యవహారాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మరో కొత్త ఫీల్డ్లోకి ఎంటరవబోతున్నాడని తెలుస్తోంది.
ఇప్పటికే ఏషియన్ గ్రూప్తో కలిసి ఏఎంబీ సినిమాస్, హంబుల్తో టెక్స్టైల్ రంగంలోకి ప్రవేశించిన మహేష్ ఇప్పుడు డిజిటల్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వినబడుతున్నాయి. ఎమ్బి ఎంటర్టైన్మెంట్ పేరుతో సినిమా నిర్మాణ రంగంలో కొనసాగుతున్న మహేశ్.. ఇదే పేరుతో సొంతగా ఓటీటీ స్టార్ట్ చేయబోతున్నాడట.
Read Also : శ్రియ కాపురంలో కరోనా కలకలం.. భర్తకు దూరంగా..
దీనికి సంబంధించి ఇప్పటికే ముంబైలోని ఓ పెద్ద నిర్మాణ సంస్థతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు సమాచారం. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల ‘ఆహా’ పేరుతో డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలి తెలుగు ఓటీటీగా ‘ఆహా’ గుర్తింపు తెచ్చుకుంటోంది. లాక్డౌన్ తర్వాత మహేశ్.. ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా ప్రారంభం కానుంది.