Robin Hood : నితిన్ సినిమాకి టికెట్ల రేటు పెంపు.. ఎంతంటే?

ఏపీలో టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు రాబిన్‌హుడ్ మూవీకి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.

Nithiin Robinhood movie ticket prices hike in AP

నితిన్ హీరోగా న‌టిస్తున్న‌ మూవీ రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. శ్రీలీల క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ అతిథి పాత్ర‌ను పోషించిన ఈ చిత్రం మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. ఏపీలో టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. సింగిల్ స్ర్కీన్ల‌లో ఒక్కొ టికెట్ పై రూ.50, మ‌ల్టీప్లెక్స్‌లో ఒక్కొ టికెట్ పై రూ.75ను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

Aditya 369 : బాల‌య్య అభిమానులకు శుభ‌వార్త‌.. ఆదిత్య 369 రీ రిలీజ్ ముందే వచ్చేస్తోంది.. కొత్త డేట్ ఇదే..

ఈ మేర‌కు జీవోను జారీ చేసింది. జీవో ప్ర‌కారం 7 రోజుల పాటు ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు అనుమ‌తి ల‌భించింది.

David Warner : రాబిన్‌హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వార్న‌ర్ స్పీచ్‌.. ఆఖ‌రిలో తెలుగులో చెప్పిన డైలాగ్ అదుర్స్‌.. ఎవ‌రు మామ అదీ..

ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్ చిత్రంపై అంచ‌నాల‌ను పెంచేశాయి. జీవీ ప్ర‌కాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండ‌గా.. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, వెన్నెల కిశోర్‌, షైన్ టామ్ చాకో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.