Panchanama : ‘పంచనామా’ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్.. నిర్మాతగా మారిన ఉదయభాను..
మీరు కూడా పంచనామా ట్రైలర్ చూసేయండి.. (Panchanama)
Panchanama
Panchanama : ప్రేమిస్తే ఫేమ్ నటుడు భరత్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న సిరీస్ పంచనామా. నటి, యాంకర్ ఉదయభాను నిర్మాణంలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. శివాజీ రాజా, మేధా రెడ్డి, చరణ్ బాబు, రూప లక్ష్మి, రాధిక ప్రీతి, సూర్య, శ్రీజ.. పలువురు ఈ సిరీస్ లో కీలక పాత్రల్లో నటించారు. జీ5 ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. 6 ఎపిసోడ్స్ గా మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ని తెరకెక్కించారు.
తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ చూస్తుంటే.. ఓ ముగ్గురు వ్యక్తులు చనిపోతారు. ముగ్గురువి యాక్సిడెంటల్ చావులు కావని ఎవరో చంపేశారని ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులను ఆశ్రయించడంతో రెండు రోజుల్లో రిలీవింగ్ కాబోతున్న జై రామ్ కేసునే టేకప్ చేస్తాడు. మరి కేసులో బయటకు వచ్చిన నిజాలేంటో తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే..
మీరు కూడా పంచనామా ట్రైలర్ చూసేయండి..
Also See : Anaswara Rajan : మరో తెలుగు సినిమాలో మలయాళం క్యూటీ.. టైటిల్ లాంచ్ ఈవెంట్లో అనశ్వర రాజన్ ఫొటోలు..
ఈ సందర్భంగా నిర్మాత ఉదయ బాను మాట్లాడుతూ.. పంచనామా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో పాటు వ్యక్తిగత భావోద్వేగ ప్రయాణాన్ని కలగలిపిన కథ. కథ ఆసక్తికరంగా ఉంటుంది అని తెలిపారు. జీ5 బిజినెస్ హెడ్ లాయిడ్ సి. జేవియర్ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా నిజాన్ని వెతికే ఓ పోలీస్ అధికారి ప్రయాణం ఎలా భారీ క్రిమినల్ కుట్రను వెలుగులోకి తీసుకువస్తుందనే అంశంతో ‘పంచనామా’ తెరకెక్కించారని తెలిపారు.
