Raj Tharun : రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్.. రాజ్ తరుణ్ తో పాటు ఇంకో ఇద్దరిపై కేసు నమోదు..

తాజాగా నిన్న లావణ్య మరోసారి రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, మాల్వి మల్హోత్రా సోదరుడు మయాంక్ మల్హోత్రాపై కేసు పెట్టి పలు ఆధారాలను పోలీసులకు సమర్పించింది.

Raj Tharun : రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్.. రాజ్ తరుణ్ తో పాటు ఇంకో ఇద్దరిపై కేసు నమోదు..

Police filed a Case on Raj Tharun and Other Two Persons with Lavanya Complaint and Evidences

Raj Tharun : గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. హీరో రాజ్ తరుణ్ తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని, అబార్షన్ చేయించాడని, ఇప్పుడు వేరే హీరోయిన్ ని పెళ్లి చేసుకోడానికి రెడీ అయ్యాడని లావణ్య అనే యువతి కేసు పెట్టింది. మీడియా ముందుకు కూడా వచ్చి లావణ్య రాజ్ తరుణ్ పై, హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై ఆరోపణలు చేసింది.

అయితే ఇప్పటికే దీనిపై రాజ్ తరుణ్ స్పందించాడు. మాల్వి మల్హోత్రా కూడా లావణ్య పై కేసు పెట్టింది. తాజాగా నిన్న లావణ్య మరోసారి రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, మాల్వి మల్హోత్రా సోదరుడు మయాంక్ మల్హోత్రాపై కేసు పెట్టి పలు ఆధారాలను పోలీసులకు సమర్పించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read : Samantha : సమంతని ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్‌తో మళ్ళీ సినిమా.. సెకండ్ ఇన్నింగ్స్‌కి బ్రేక్ ఇస్తాడా..?

ఏ1 గా రాజ్ తరుణ్, ఏ2 గా మాల్వి మల్హోత్రా, ఏ3 గా మయాంక్ మల్హోత్రా లపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజా ఫిర్యాదులో లావణ్య.. 2008 నుండి రాజ్ తరుణ్ నాకు పరిచయం, 2010లో రాజ్ నాకు ప్రపోజ్ చేసాడు. 2014లో రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. రాజ్ తరుణ్ ని మా కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుంది. రాజ్ తరుణ్ కు ఉన్న ఆర్థిక సమస్యలు మొత్తాన్ని మా కుటుంబం భరించింది. రాజ్ తరుణ్ కు ఇప్పటివరకు 70 లక్షల రూపాయలు ఇచ్చాము. రాజ్ తరుణ్ పెంచుకునే కుక్కల కారణంగా 6 సంవత్సరాల్లో 6 ఇల్లులు మారాల్సి వచ్చింది. 2016లో నేను గర్భవతి అయ్యాను. రెండవ నెలలో నాకు అబార్షన్ చేయించాడు. నా హాస్పిటల్ బిల్స్ అన్ని రాజ్ తరుణ్ చెల్లించాడు. అమెరికా వెళ్లిన నేను ఈ జనవరిలో తిరిగి వచ్చాను. రావడంతోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నన్ను పోలీసులు అరెస్టు చేశారు. నాపై డ్రగ్స్ కేస్ ఉందంటూ తప్పుడు ఆరోపణలతో పోలీసులు నన్ను రిమాండ్ చేశారు. 45 రోజులు నేను జైల్లో ఉన్నాను. రాజ్ తరుణ్ తో పాటు మాల్వి మల్హోత్రా కలిసి నన్ను ఇరికించారు అని తెలిపింది.

అలాగే.. ప్రేమ,పెళ్లి పేరుతో మోసం చేసినందుకు రాజ్ తరుణ్ పై, తనను చంపేస్తామని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసిన మాల్వితో పాటు ఆమె సోదరుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. దీంతో నార్సింగ్ పోలీసులు ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద ఈ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అయితే వీటిపై రాజ్ తరుణ్ ఇంకా స్పందించలేదు.