Radha : కూతురి పెండ్లి పిలుపుల్లో రాధా.. చాలా ఏళ్ళ తరువాత రాఘవేంద్రరావుని కలిసి..
కార్తీక పెండ్లి పిలుపుల్లో భాగంగా చాలా ఏళ్ళ తరువాత రాఘవేంద్రరావుని కలిసిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ.
Radha : ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ 1980 కాలం తరువాత మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. ఆ తరువాత ఆమె వారసులుగా కార్తీక నాయర్, తులసి నాయర్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే వీరిద్దరూ రాధాలా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేక పోయారు. పది సినిమాలు కూడా చేయకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటూ బిజినెస్ వుమెన్ గా మారిపోయారు. కార్తీక ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న తన ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ చూసుకుంటున్నారు.
అక్కడ తమ బిజినెస్ ని మరింత విస్తరించిన కార్తీక.. ఇప్పుడు పెళ్లి జీవితాన్ని మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇటీవల ఒక పిక్ షేర్ చేసి ఎంగేజ్మెంట్ వార్తని అందరికి తెలియజేసారు కార్తీక. ఆ తరువాత నిశ్చితార్థంకి సంబంధించిన ఫోటోలను రాధా తన సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఆ వరుడు ఎవరు..? పెళ్లి ఎప్పుడు..? అన్న వివరాలు తెలియజేయలేదు. ప్రస్తుతం ఈ పెళ్లి పనులు జరుగుతున్నట్లు తెలుస్తుంది.
Also read : Bigg Boss 7 : ప్రియాంక కోసం ప్రియుడు బిగ్బాస్ ఎంట్రీ.. హౌస్లోనే పెళ్లి చేసుకుందామంటూ..
View this post on Instagram
View this post on Instagram
అయితే రీసెంట్ గా రాధా టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావుని కలిశారు. ఆ వీడియోని షేర్ చేస్తూ.. అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు అంటూ అంటూ చెప్పుకొచ్చారు. ఈ మీటింగ్ ఎన్నో కొత్త జ్ఞాపకాలని ఇచ్చిందంటూ పేర్కొన్నారు. ఇక ఈ వీడియోకి రాఘవేంద్రరావు రెస్పాండ్ అవుతూ.. “చాలా సంవత్సరాలు తరువాత కలిసినందుకు సంతోషంగా ఉంది. నీ కూతురు పెళ్ళికి నా శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు. కార్తీక పెండ్లి పిలుపుల్లో భాగంగానే రాధా రాఘవేంద్రరావుని కలిసినట్లు తెలుస్తుంది.
Glad to see you Radha after so many years.. And Congratulations for your daughter marriage. All the good luck pic.twitter.com/afE2xyuW5i
— Raghavendra Rao K (@Ragavendraraoba) November 8, 2023