Samyuktha is being part of puri sethupathi movie
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తాజాగా మరో నటి భాగమైంది. నటి సంయుక్త జాయిన్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం తెలియజేసింది.
పూరి జగన్నాథ్, ఛార్మి, సంయుక్తతో ఉన్న ఫోటోను పంచుకుంది. ఆమె నడకలో హుందాతనం.. కళ్లల్లో ఆగ్రహం.. అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్గా మారింది.
Chiranjeevi-Pawan Kalyan : రిలీజ్ డైలమాలో చిరు, పవన్ సినిమాలు..
Grace in her stride. Fire in her eyes.
Welcoming the stunning @iamsamyuktha_ on board into the electrifying world of #PuriSethupathi ❤️🔥❤️🔥❤️🔥
A #PuriJagannadh film
Starring Makkalselvan @VijaySethuOffl, #Tabu, and @OfficialVijiProduced by Puri Jagannadh & @Charmmeofficial under… pic.twitter.com/RzlZMBs4DJ
— Puri Connects (@PuriConnects) June 17, 2025
ఇక ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, ఛార్మి నిర్మిస్తున్నారు. ఇప్పటికే టబు, దునియా విజయ్ వంటి స్టార్స్ ఈ మూవీలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘భిక్షాందేహి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
Ram Charan : బాలీవుడ్ దర్శకుడితో రామ్చరణ్ మూవీ?
దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కు గతకొంతకాలంగా సరైన హిట్ పడడం లేదు. ఆయన గత సినిమాలు లైగర్, డబుల్ ఇస్మార్ట్లు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ క్రమంలో విజయమే లక్ష్యంగా విజయ్సేతుపతిలో కొత్త ప్రాజెక్ట్ను మొదలుపెట్టారు.