Mahesh Babu: సూపర్ స్టార్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటో!
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె హఠాన్మరణంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇటీవలే కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా మరణించిన విషయం తెలిసిందే.
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె హఠాన్మరణంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇటీవలే కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా మరణించిన విషయం తెలిసిందే.
Ram Charan: ఇందిరా దేవి గారి సంస్మరణ సభకు హాజరైన చరణ్ అండ్ ఉపాసన..
నెలల వ్యవధిలో ఇద్దరినీ కోలుపోవడంతో ఘట్టమనేని కుటుంబంలో గత కొన్నిరోజులుగా విషాదఛాయలు అలుముకున్నాయి. తమ అభిమాన హీరో కుటుంబాన్ని అలా చూడలేక అభిమానులు.. వారు త్వరగా ఆ బాధ నుంచి బయటపడాలంటూ ప్రార్ధనలు చేశారు. అయితే అభిమానుల ఆశించిన విధంగానే అంతా జరిగింది.
నిన్న ఇందిరా దేవి గారి సంస్మరణ దినం నిర్వహించగా.. ఈ కారిక్రమానికి సినీప్రముఖలతో పాటు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫామిలీ మొత్తం ఆనందంగా ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. తమ అభిమాన హీరోని మళ్ళీ అలా సంతోషంగా చూడడంతో ఫ్యాన్స్ కూడా ఆనంద పడుతున్నారు.