Tollywood Horror Movie Team wants to do Pre Release Event in Graveyard
Horror Movie : ఇటీవల సినిమాలు ప్రమోషన్స్ చాలా కొత్త కొత్తగా చేస్తున్నాయి. తమ సినిమాని జనాల వద్దకు తీసుకెళ్లడానికి మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో కొత్త పుంతలు తొక్కుతుంది. కొంతమంది కాలేజీలకు, హోటల్స్ కి, మాల్స్ కి, ఆఖరికి రోడ్ల మీద, ట్రైన్స్ లో.. కూడా సినిమా ప్రమోషన్స్ చేస్తూ తమ సినిమాలకి కొత్త రకం పబ్లిసిటీ చేస్తున్నారు. తాజాగా ఓ హారర్ సినిమా మూవీ యూనిట్ ఒక అడుగు ముందుకేసి సరికొత్తగా ఆలోచించింది.
టాలీవుడ్ లో ఇటీవల భయపెట్టే హారర్ సినిమాలు కూడా చాలా వస్తున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో రాబోయే ఓ హర్రర్ సినిమాకి టీజర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ బేగంపేట స్మశానంలో చేయాలని అనుకున్నట్టు టాలీవుడ్ సమాచారం. ఆల్రెడీ స్మశానం లొకేషన్ కూడా చూసి వచ్చారంట ఆ మూవీ యూనిట్. అయితే ఆ సినిమా అంజలి నటిస్తున్న గీతాంజలి సీక్వెల్ సినిమా అని తెలుస్తుంది
ఫిబ్రవరి 24 శనివారం రాత్రి 7 గంటలకు గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా టీజర్ లాంచ్ ని బేగంపేట్ స్మశాన వాటికలో నిర్వహించనున్నట్టు సమాచారం. దీంతో టాలీవుడ్ ఆశ్చర్యపోతుంటే ఇది తెలిసిన జనాలు మాత్రం ఇలా కూడా ప్రమోషన్స్ చేస్తారా? మరీ ఓవర్ గా అనిపించట్లేదా? అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఈ శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేట్ స్మశాన వాటికలో ⚰️ గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్ ??
Brace Yourselves for a Never Before Event In Telugu Cinema ❄️?#GeethanjaliMalliVachindhi #Anjali50 @yoursanjali @konavenkat99 @MP_MvvOfficial #GV #ShivaTurlapati @Plakkaraju… pic.twitter.com/dAqb09Vddh
— Telugu FilmNagar (@telugufilmnagar) February 22, 2024