Earthquake: రాజస్థాన్‌లో భూకంపం.. దేశంలో మరో మూడుచోట్ల కూడా!

దేశంలో మూడు చోట్ల భూకంపాలు సంభవించినట్లుగా జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం ప్రకటించింది. రాజస్థాన్, మేఘాలయ, లే-లడఖ్‌లలో బుధవారం ఉదయం భూకంప ప్రకంపనలు సంభవించాయి.

Earthquake Rajasthan

Earthquake: దేశంలో మూడు చోట్ల భూకంపాలు సంభవించినట్లుగా జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం ప్రకటించింది. రాజస్థాన్, మేఘాలయ, లే-లడఖ్‌లలో బుధవారం ఉదయం భూకంప ప్రకంపనలు సంభవించాయి. భూకంపం వణుకు కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రాజస్థాన్‌లోని బికానెర్‌లో భూకంపం తీవ్రత 5.3గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం తెలిపింది.

ఉదయం 5 గంటల 24 నిమిషాల సమయంలో బికనీర్‌కు పశ్చిమ వాయువ్య దిశగా 343 కిలోమీటర్ల దూరంలో 110 కిలోమీటర్ల లోతులో 29.19 -అక్షాంశం 70.05- రేఖాంశల నడుమ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ట్విట్టర్‌లో వెల్లడించింది. అదే సమయంలో, మేఘాలయ మరియు లేహ్-లడఖ్‌లో కూడా వరుసగా 4.1 మరియు 3.6 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.

ఈ మూడు ప్రాంతాలలో భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరిగినట్లు నివేదిక లేనప్పటికీ, భూమి వణుకుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మేఘాలయలోని వెస్టు ఘరోహిల్స్‌ ప్రాంతంలో ఉదయం 4.1 మేగ్నట్యూడ్‌ తీవ్రతతో భూకంపం సంభవించింది.